ఆస్ట్రేలియా పౌరసత్వం... తెలంగాణలో లిక్కర్ స్కామ్!

Publish Date:Feb 25, 2026

Advertisement

హైదరాబాద్‌లో మరో బిగ్ బిజినెస్ గురు  అసలు రూపం బయటపడింది. లిక్కర్ తయారీ కేంద్రాలు పెడతాను, పబ్బులు తెరిపిస్తా, లైసెన్సులు ఇప్పిస్తానంటూ వ్యాపారు లకు కలల కోటలు చూపించి కోట్ల రూపాయలు గుంజేసిన అక్కల రామకృష్ణ ప్రసాద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.  ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన కథ, చివరకు లోకల్ లాక్‌ప్ కు చేరింది.
 బేవరేజ్ ఫ్యాక్టరీ పెడదాం… మనదే మార్కెట్  అంటూ వ్యాపారి నరేందర్ ను నమ్మించి అతని వద్ద నుంచి విడతల వారీగా రూ.1.30 కోట్లు వసూలు చేసిన రామకృష్ణ, ఫ్యాక్టరీ మాత్రం కలలో కూడా కనిపించనివ్వ కుండా మాయమయ్యాడు.

దీంతో మోసపోయిన నరేందర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న  సీసీఎస్ పోలీసులు అక్కల రామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేశారు.  నిందితుడు పారిపోవాలని ప్లాన్ చేసినా… పోలీసుల ఎల్ఓసి ముందే వచ్చింది. ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లేలోపే బోర్డింగ్ పాస్ కు బదులు  అరెస్ట్ మెమో  చేతికి అందించిన పోలీసులు అక్కల రామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేశారు. ఇలా పోలీసుల చేతికి చిక్కిన రామకృష్ణ చెప్పిన కథలు మాత్రం సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువ కావు. సొంత ల్యాండ్ కొన్నానని…ఫ్లాట్ రెడీ అవుతోందని…సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లో పెట్టుబడులు పెడితే డబ్బుల వర్షం కురు స్తుందని…మాయమాటలు చెప్పి వ్యాపారులను నమ్మించాడు. అది నిజమని నమ్మిన వ్యాపారులు పెట్టుబడులు పెట్టగా, లాభాలు కాకుండా  వారి లాకర్ ఖాళీ అయినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది..

అయితే నిందితుడు ఆస్ట్రేలియాలో కూడా ఇదే స్క్రిప్ట్ నడిపి చీటింగ్ కేసుల్లో జైలు జీవితం గడిపిన అనుభవం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరి  మళ్లీ మోసాలకు పాల్పడు తున్నట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.4 కోట్ల రుణం కూడా తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లు సమాచారం. విలాసవంతమైన జీవితం కోసం వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేయడం ఇతని స్టైల్‌ అని పోలీసుల విచారణలో బయటపడింది.ఇక నిందితుడి తండ్రి వరప్రసాద్, సహచరుడు విక్రమ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రామకృష్ణ చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సీసీఎస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.మొత్తానికి నిందితుడి కథ లిక్కర్ ఫ్యాక్టరీ పేరుతో మొదలైన బిజినెస్, పోలీస్ స్టేషన్‌లో  కేస్ ఫైల్ తో ముగిసింది.

By
en-us Political News

  
పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్వేష్‌ తన సోషల్ మీడియా వేదికల ద్వారా పలుమార్లు అసభ్యకర పదజాలంతో వీడియోలు రూపొందించి ప్రజల్లోకి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందిస్తూ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాబోయే వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో చ‌దువుకుంటున్నా, అమ్మ‌లాంటి తెలుగుభాష‌ను మ‌రువొద్ద‌ని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు.
తాజాగా మరో సారి తెలంగాణలోని నాంపల్లి కోర్టు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు లేఖలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు ఆయా కోర్టుల ఆవరణల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులను ఖాళీ చేయించి ఈ తనిఖీలు నిర్వహించారు.
బీహార్‌లో ప్రేమ విఫలం కావడంతో పెళ్లి వేడుకలో కాల్పుల ఘటన సంచలనం రేపింది.
మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే శనివారం (ఫిబ్రవరి 28) పంపిణీ చేయనుంది. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం రాకుండా ఫిబ్రవరి 28న చెల్లింపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు అధికారిక ఉత్తర్వులు అందాయి.
జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్‌ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక మైన గుర్తింపు పొందింది.
శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన మాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ హైకోర్టు కొనియాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రశంసను లోకేష్ హైకోర్టు నుంచి అందుకున్నారు.
ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో లారెన్స్ బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త ప్రయాణిస్తున్న కారుపై జరిగిన కాల్పులలో ఒకరు గాయపడ్డారు. బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త దీపక్ ఖత్రీ, తన స్నేహితులతో కలిసి కారులో వెడుతుండగా, బైక్‌పై దుండగులు కారును వెంబడించి వెనుక నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు.
ట్రంప్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 1974లోని మరో సెక్షన్‌ను ఉపయోగించి అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. తన తాజా ప్రసంగంలో ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్న ట్రంప్ ట్రంప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.