హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ లలో మోసాలు

Publish Date:May 4, 2024

Advertisement

TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళను నమ్మి మోసపోయానంటారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సి.హెచ్ శ్రీనివాస‌రావు. ఆ  కంపెనీ వాళ్ళు ప్రజల ఆరోగ్య అవసరాలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ లో పాలసిదార్లు గా చేర్చుకునే టార్గెట్లు పూర్తి చేసుకునే వరకు అనేక రకాలు గా కబుర్లు చెప్పి చేర్చుకొని ప్రీమియం వసూలు చేసుకుంటారు.  ఆ తరువాత అదే పాలసీ హోల్డర్ ఆసుపత్రి పాలై చికిత్స తీసుకుంటే మాత్రం క్లెయిమ్ ల దగ్గరకి వచ్చేసరికి హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీల అసలు రంగు బయటపడుతుంది. క్లెయిమ్ లను ఎగ్గొట్టడానికి ఎన్నెన్ని రకాలుగా ఎత్తులు వేస్తారో చెపితే కొత్తగా లేని బీపీ, షుగర్ వ్యాధులు వస్తాయంటున్నారు శ్రీనివాస్.

ఇన్యూరెన్స్ కంపెనీ శ్రీనివాస్‌ను మోసం చేసిన తీరును ఆయ‌న వివ‌రించారు. నేను ఏప్రిల్ 19వ తేదీన గుండె పోటు కి గురయ్యి  సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరాను. అదే రోజున స్టంట్ వేశారు. ICCU నుంచి రూమ్ కు షిఫ్ట్ చేసిన తర్వాత మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని క్లెయిమ్ కోసం అక్కడే దరఖాస్తు చేసుకున్నాను. కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కు అవసరమైన వివరాలు, రికార్డులన్నీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళు రంగంలో కి దిగారు. మొదటి కొర్రిగా బీపీ గురించి అడిగితే దానికి ఒక డాక్టర్ లెటర్ పంపారు. ఆ తర్వాత ఒక గంట సమయం తర్వాత మరో కొర్రి అడిగారు. ఈసారి షుగర్ గురించి. దానికీ మళ్ళీ ఒక సర్టిఫికెట్ పంపాము. మరో గంట సమయం తర్వాత మరో కోర్రి అడుగుతూ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఈసారి హైపర్ టెన్షన్ గురించి. మళ్లీ దానికి డాక్టర్ లెటర్ పంపారు. మరో గంట సమయం తర్వాత మళ్లీ కోర్రీ అడుగుతూ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. షుగర్ గురించి పాత రికార్డులు అడిగారు. ఏదో జోక్ చెప్పినట్లుగా... "ఆరు నెలల క్రితం బ్రతికి ఉన్నట్లు గా లెటర్ తీసుకురామట్లుగా'' అడిగారు. పాత ప్రెస్క్రిప్షన్లు ఎక్కడో పడిపోయి ఉంటాయిగా... ఇక దాన్నే పట్టుకున్నారు TATA AIG GENERAL INSURANCE కంపెనీ వాళ్ళు. ఇక సహనం నశించి ఆ కంపెనీ మేనేజర్ నరేష్ గారి నెంబరు ఎలా గోలా కనుక్కొని ఫోన్ చేసి నా బాధ, టెన్షన్ మొత్తం వివరించా. వాదోప వాదనలు పూర్తయిన తర్వాత ఆయన ఒక ఆథ‌రైజేషన్ లెటర్ ఇవ్వమన్నారు. అది కూడా ఇచ్చాను. ఆ తరవాత సోమవారం రాత్రి ( ఏప్రిల్ 22వ తేదీ)  TATA AIG GENERAL INSURANCE కంపెనీ నుంచి నర్సయ్య అనే వ్యక్తి హాస్పిటల్ లోనీ నా రూమ్ (A9006)కు వచ్చారు. నా ఫోటో, నాతో పాటు నా పక్కనున్న నా భార్య ఫోటో తీసుకున్నాడు. మళ్లీ అదే వ్యక్తీ పక్కనే ఉన్న రిసెప్షన్ లో నర్సుల దగ్గరకు వెళ్ళి మొత్తం నా రికార్డులన్నీ ఫొటోలు తీసుకున్నాడు. ఇన్స్పెక్షన్ కు వచ్చినట్లుగా నా నుంచి సంతకం కూడా తీసుకున్నాడు. ఈ మొత్తం తతంగమంతా రెండు రోజుల పాటు జరిగింది. ఇంతా చేస్తే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఇచ్చారా... అంటే అదీ లేదు... పాత రికార్డులు లేవని నా క్లెయిమ్ ను ఇవ్వకుండా తిరస్కరించారు. అంటే ఆరేళ్ళ క్రితం నేను బ్రతికి ఉన్నట్లుగా రికార్డులు ఇవ్వనందుకన్నమాట...ఇందులో ఏమైనా అర్థముందా?

నేను ఆసుపత్రిలో చేరింది గుండె పోటుతో... స్టంట్ వేశారు... దానికి చికిత్స చేశారు. బిల్లు కూడా అందుకే వేశారు... కొర్రీలు పేరుతో రెండు రోజుల పాటు వేధించారు... అయినా ఓపికగా డాక్యుమెంటరీ జవాబులు ఇచ్చాం. ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి ఇన్స్పెక్షన్ కు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. బోగస్ క్లెయిమ్ కాదు నిజమైన క్లెయిమ్ యే నని నిర్ధారించుకున్నారు. అయినా పాత ప్రిస్క్రిప్షన్ లు ఇవ్వలేదని రిజెక్ట్ చేసారు. ఇలా ఒక సీనియర్ జర్నలిస్ట్ కే వేధింపులు తప్పలేదు... క్లెయిమ్ ఇవ్వలేదంటే ఇక మిగతా సామాన్య జనం పరిస్ఠితి ఎలా ఉంటుందో మ‌రి...

హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవ‌రు?

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రశాంత్ కిషోర్ తాను చెప్పినదానికి కట్టుబడి వుంటున్నారు. అంటే, మన జలగన్న ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ఐదేళ్ల దుష్టపాలనను వదిలించేసుకుందా? ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ వైసీపీ నేతల మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి ఉక్రోషం చూస్తుంటే.. విజయంపై నమ్మకాన్ని వాళ్లు వదిలేసుకున్నారని అనిపించక మానదు.
దమ్మున్న కమ్మ కులస్తులు, ఊపున్న కాపు కులస్తులు... ఈ రెండు శక్తులూ కలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోని తరిమేశాయ్.
పల్నాడు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిందని   మంత్రి  అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు
ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు.
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చైనా భారత్ సరిహద్దు వివాదం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. అయితే డ్రాగన్ దేశం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా చైనా భారత్ మీద మరో అఘాయిత్యానికి పాల్పడింది. భారత పౌరుల చేత భారత్ మీదే సైబర్ నేరాలకు పాల్పడాలన్న చైనా  కుట్ర భగ్నమైంది. 
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది.
పెద్దలు సాధారణంగా నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు. కానీ చాలామంది కడుపులో రాళ్ళు పెంచుకుంటున్నారు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఏపీలో వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును అడ్డుపెట్టుకోవ‌టం వారికి అల‌వాటుగా మారింది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్లుగా ఇదే ప‌ని చేశారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని తంబిగాని పల్లెలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.