జగన్ ను భయం వెంటాడుతోందా?

Publish Date:Oct 25, 2024

Advertisement

జగన్ ను భయం వెంటాడుతోందా? ఓ పక్క కేసుల భయం, మరో పక్క అరెస్టు భయంతో జగన్ వణికిపోతున్నారా?  అంటే జగన్ చేష్టలూ, మాటలను బట్టి ఔననే అనుకోవలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సోదరి షర్మిలతో ఓ వైపు రాయబేరాలు నెరపుతూనే మరో పక్క ఆమెపై నేషనల్ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ వేయడం ద్వారా తన మానసిక స్థితి సరిగా లేదని ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నారని అంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే షర్మిలతో రాయబారాలకు ప్రయత్నిస్తూనే, ఆమెకు ఆమె వాటా ఆస్తులు ఇచ్చేస్తామంటూనే ఆమె తనగురించి, తన భార్య గురించి మాట్లాడడం మానేయాలని షరతు విధించారు. ఆ షరతు వరకూ అయితే పెద్దగా ఎవరికీ, ఆఖరికి షర్మిలకు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ, దానితో పాటుగా ఆయన పెట్టిన మరో కండీషనే జగన్ రెడ్డిలోని భయాన్ని ఎత్తి చూపిందంటున్నారు.   షర్మిల అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఎటువంటి వ్యాఖ్యలూ చేయకూడదన్నదే ఆ మరో కండీషన్. 

గత నెలలో జగన్ రెడ్డి తన తల్లి సోదరి, చెల్లి షర్మిలతో సయోధ్య కోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో సయోధ్య కుదరాలంటే తనపైనా, తన భార్య భారతిపైనా ఎటువంటి విమర్శలూ చేయకూడదన్న షరతు విధించారు. అక్కడితో ఆగకుండా  షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా ఎటువంటి విమర్శలూ చేయకూడదన్న షరతు కూడా పెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, కీలక నిందితులలో ఒకడిగా ఉన్న అవినాష్ రెడ్డిపై షర్మిల విమర్శించకూడదంటూ జగన్ విధించిన షరతును షర్మిల అంగీకరించలేదని అంటున్నారు. దాంతోనే షర్మిల, తల్లి విజయమ్మలపై నేషనల్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారని అంటున్నారు.

అయినా జగన్ సొంత తల్లి, చెల్లి కంటే సవతి సోదరుడు అవినాష్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు. సోంత బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి పట్ల జగన్ కు అంత అక్కర ఎందుకు అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమౌతాయి.  ఇప్పటికే  వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న జగన్ రెడ్డి ప్రతిష్ఠ సొంత ఇలాకాలోనే మసకబారింది.  జనం వివేకా హత్య కేసు సూత్రధారి అవినాష్ రెడ్డే అని నమ్ముతున్నారు. అయితే జగన్, భారతి మాత్రం ఈ కేసులో  సీబీఐ దర్యాప్తు అవినాష్ తో ఆగదనీ, తమ వరకూ వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే ఎలాగైనా అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.