ఏపీ ఎన్నికల్లోనూ బర్రెలక్కలు!

Publish Date:Mar 13, 2024

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో ఆమె విజయం సాధించలేదు. అలాగని అధికార పార్టీ అభ్యర్థికి చెమట్లు పట్టించేంత పోటీ కూడా ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 15 వేల ఓట్లు వచ్చాయి. అయితే తన పోటీ ద్వారా ఆమె అధికార పార్టీ పునాదులను కదిలించింది. ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేసినా, ఆమె పోటీ చేయడానికి దారి తీసిన పరిస్థితులు, ఆమె లేవనెత్తిన అంశాల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ముఖ్యంగా తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించిన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిగింది. ఆ ప్రభావం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ప్రభావితం చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం..

ఇప్పుడు ఏపీ ఎన్నికలలో  జగన్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలకు బాధితులై న నలుగురు అసెంబ్లీ పోరులో నిలబడుతున్నారు. పరిశీలకులు ఈ నలుగురూ కూడా ఏపీ ఎన్నికలపై తమదైన ప్రభావాన్ని చూపగలరని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బర్రెలక్క పోటీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అక్కడి అధికార పార్టీపై ప్రతికూలంగా పడిందో.. ఏపీ ఎన్నికలలో ఈ నలుగురి పోటీ అలాగే జగన్ సర్కార్ పై జనంలో ప్రతికూలత మరింత పెరిగేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇంతకీ తెలంగాణలో బర్రెలక్క చూపినట్లుగా ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ప్రొది కావడానికి దోహదపడే ఆ నలుగురూ ఎవరంటారా?.. ఆ విషయం చెప్పుకునేముందు గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన బాబాయ్ హత్య, కోడికత్తి దాడి, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల ప్రచారం.  ఇప్పుడు ఆ ముగ్గురూ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడనున్నారు. వీరితో పాటుగా గత ఎన్నికల ముందు హత్యకు గురైన వివేకా కుమార్తె సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో ఎవరో ఒకరు కడప పార్లమెంటు బరిలో నిలవనున్నారు. ఇక వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా జగన్ ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీలో ఉంటానని చెబుతున్నారు. 

ఈ నలుగురే తెలంగాణ ఎన్నికలలో బర్రెలక్క పోటీ  అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాగైతే ఓటమి బాటను చూపిందో.. వీరు జగన్ సర్కార్ కూడా అదే బాట పట్టడానికి దోహదపడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఔను కోడికత్తి శీను జై భీమ్ పార్టీలో చేరి కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పోటీలో నిలవనున్నారు. వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగడం దాదాపు ఖరారైంది. అలాగే జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ సర్కార్ ను చెరిగి పారేస్తున్నారు. ఆమె కూడా ఎన్నికల బరిలో నిలుచుంటారు. చివరిగా దస్తగిరి కూడా జైభీమ్ పార్టీలో చేరి పులివెందుల బరిలో దిగేందుకు రెడీ అయిపోయారు. వీరు నలుగురూ గెలిచినా, ఓడినా వీరి పోటీ ప్రభావం మాత్రం రాష్ట్రం మొత్తం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టీకానికి వీరు నలుగురూ కూడా బాధితులే కావడం ఇందుకు కారణమని చెబుతున్నారు.  

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.