Publish Date:Jan 26, 2025
మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా జీర్ణకోశ సంబధింత ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజకీయాలలోకి రాకముందు ఆర్. సత్యనారాయణ జర్నలిస్టు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఉద్యమంలో చురుకుగా పని చేసిన సత్యనారాయణ టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడిగా, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా పలు పదవులను నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీచేసిన సమయంలో సత్యనారాయణ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డికి కూడా ఆయన ఎన్నికల ఏజెంట్గా బాధ్యతలు నిర్వహించారు.
అలాగే జర్నలిస్టుగా ఆయన తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. వ్యక్తిగతంగా మంచితనం కలిగి ఉండడం,మంచి చేయడానికి నలుగురినీ కూడగట్టడం ఆర్.సత్యనారాయణ నైజం. జర్నలిస్టుగా ఆయన అదే ఒరవడి కొనసాగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా జర్నలిస్టులనందరినీ ఏకతాటిపై నడిపించారు. ఆయన మృతి తీరని లోటని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పలు పార్టీల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆర్.సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపార బీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సత్యనారాయణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సత్యన్నారాయణ పార్ధివ దేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mp-rsatyanarayana-nomore-25-191889.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.