Publish Date:Jul 22, 2025
జగన్ స్టైలే వేరబ్బా. చాలా మంది చంద్రబాబే సంపద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అదే సొంతంగా సంపాదించడంలో జగన్ తర్వాతే ఎవరైనా. గతంలో తండ్రి అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా భారీ ఎత్తున అవినీతికి తెరలేపారా? అదే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న కొత్త పదజాలం.. కిక్ బ్యాక్స్. ఈ కిక్ బ్యాక్స్ ఇప్పుడు కరప్షన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకూ ఏ1 టు ఏ 38 ఒక సిండికేట్ గా ఏర్పడి.. వీరు చేసిన విధ్వంసం విలువ 3500 కోట్లు. ఈ మొత్తం నాలుగైదు చేతులు మారి ఫైనల్ గా చేరింది జగన్ కే అంటారు. ఛార్జ్ షీట్ లో కూడా జగన్ పేరు ప్రముఖంగానే ప్రస్తావించారు. అయితే జగన్ కి చేరినట్టు గల ఆధారాలు సంపాదించడం అంత తేలికేనా? అన్నదొక ప్రశ్న.
గతంలో కూడా జగన్ ఇలాగే.. క్విడ్ కో ప్రో ద్వారా ఎవరికీ చిక్కకుండా చేసిన హడావిడి హంగామా పత్రికల్లో కనిపించింది తప్ప.. పెద్ద గొప్పగా జగన్ ఇరుక్కున్నదేం లేదు. పైపెచ్చు లక్ష కోట్లని చెప్పి చివరికి తేల్చింది 12 వందల కోట్లకన్నా మించి లేదు. దానికి తోడు అవన్నీ కూడా తండ్రి హయాంలో జరిగినవి. కాబట్టి ఇవేవీ పెద్ద నిలబడే కేసులు కావన్న కోణంలో ఉండవల్లి లాంటి వారినోటి నుంచి వినవచ్చిందీ వినే ఉంటాం.
ఇపుడీ లిక్కర్ కేసు పరిస్థితేంటి? అన్నదొక చర్చ. ఇందులో పెద్ద పెద్ద తిమింగలాలు బయట పడతాయి, ప్రపంచంలో అతి పెద్ద మద్యం కేసు అని మంత్రి కొల్లు చెబుతున్నారుగానీ.. అతి పెద్ద తిమింగలం ఎవరు? ఆ తిమింగలాన్ని ఎలా అరెస్టు చేస్తారంటే అందుకు తగిన ఆధారాలున్నట్టే కనిపించడం లేదు.
రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకూ సాగించిన ఈ లిక్కర్ లీలలో సొమ్మంతా జగన్ కి చేరినట్టు చెబుతున్నారు కానీ అందుకు తగిన ఆధారాలు కేవలం నోటిమాటలుగానే తెలుస్తున్నాయి. ఈ వాంగ్మూలాలతో జగన్ ని బుక్ చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా? అన్నది మరొక ప్రశ్న.
జగన్ ఎప్పుడూ తన వైపు తప్పు ఉండేలా చేసుకోరు. అది క్విడ్ ప్రో కోలో అయినా, కిక్ బ్యాక్స్ వ్యవహారంలో అయినా. ఎవరెంత మొత్తుకున్నా.. ఆయనకంటూ ఒక లూప్ హోల్ పెట్టుకుని అందులోంచి తప్పించుకోవడం తనదైన కరెప్షన్ స్టైల్. కాబట్టి ఆ తిమింగలం అంత తేలిగ్గా చిక్కేది కాదని అంటారు కొందరు న్యాయనిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mla-chevireddy-bhaskar-reddy-25-202487.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.