Publish Date:Jul 22, 2025
జగన్ స్టైలే వేరబ్బా. చాలా మంది చంద్రబాబే సంపద సృష్టిలో టాప్ అంటారుగానీ అదంతా ఉట్టిది. ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అదే సొంతంగా సంపాదించడంలో జగన్ తర్వాతే ఎవరైనా. గతంలో తండ్రి అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా భారీ ఎత్తున అవినీతికి తెరలేపారా? అదే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న కొత్త పదజాలం.. కిక్ బ్యాక్స్. ఈ కిక్ బ్యాక్స్ ఇప్పుడు కరప్షన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకూ ఏ1 టు ఏ 38 ఒక సిండికేట్ గా ఏర్పడి.. వీరు చేసిన విధ్వంసం విలువ 3500 కోట్లు. ఈ మొత్తం నాలుగైదు చేతులు మారి ఫైనల్ గా చేరింది జగన్ కే అంటారు. ఛార్జ్ షీట్ లో కూడా జగన్ పేరు ప్రముఖంగానే ప్రస్తావించారు. అయితే జగన్ కి చేరినట్టు గల ఆధారాలు సంపాదించడం అంత తేలికేనా? అన్నదొక ప్రశ్న.
గతంలో కూడా జగన్ ఇలాగే.. క్విడ్ కో ప్రో ద్వారా ఎవరికీ చిక్కకుండా చేసిన హడావిడి హంగామా పత్రికల్లో కనిపించింది తప్ప.. పెద్ద గొప్పగా జగన్ ఇరుక్కున్నదేం లేదు. పైపెచ్చు లక్ష కోట్లని చెప్పి చివరికి తేల్చింది 12 వందల కోట్లకన్నా మించి లేదు. దానికి తోడు అవన్నీ కూడా తండ్రి హయాంలో జరిగినవి. కాబట్టి ఇవేవీ పెద్ద నిలబడే కేసులు కావన్న కోణంలో ఉండవల్లి లాంటి వారినోటి నుంచి వినవచ్చిందీ వినే ఉంటాం.
ఇపుడీ లిక్కర్ కేసు పరిస్థితేంటి? అన్నదొక చర్చ. ఇందులో పెద్ద పెద్ద తిమింగలాలు బయట పడతాయి, ప్రపంచంలో అతి పెద్ద మద్యం కేసు అని మంత్రి కొల్లు చెబుతున్నారుగానీ.. అతి పెద్ద తిమింగలం ఎవరు? ఆ తిమింగలాన్ని ఎలా అరెస్టు చేస్తారంటే అందుకు తగిన ఆధారాలున్నట్టే కనిపించడం లేదు.
రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకూ సాగించిన ఈ లిక్కర్ లీలలో సొమ్మంతా జగన్ కి చేరినట్టు చెబుతున్నారు కానీ అందుకు తగిన ఆధారాలు కేవలం నోటిమాటలుగానే తెలుస్తున్నాయి. ఈ వాంగ్మూలాలతో జగన్ ని బుక్ చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా? అన్నది మరొక ప్రశ్న.
జగన్ ఎప్పుడూ తన వైపు తప్పు ఉండేలా చేసుకోరు. అది క్విడ్ ప్రో కోలో అయినా, కిక్ బ్యాక్స్ వ్యవహారంలో అయినా. ఎవరెంత మొత్తుకున్నా.. ఆయనకంటూ ఒక లూప్ హోల్ పెట్టుకుని అందులోంచి తప్పించుకోవడం తనదైన కరెప్షన్ స్టైల్. కాబట్టి ఆ తిమింగలం అంత తేలిగ్గా చిక్కేది కాదని అంటారు కొందరు న్యాయనిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-mla-chevireddy-bhaskar-reddy-25-202487.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.