మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. తిరుమల వెంకన్న దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ప్రైవేటు సంభాషణల్లో అదీ.. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఎదురుగా అన్నట్లు చెబుతున్నారు. ఔను తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆమె అన్న మాటలకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారింది.
వాస్తవానికి రోజా మంత్రిగా ఉన్న సమ యంలో రోజుకు వందలు వేలుగా టీటీడీ దర్శనం టోకెన్లను అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ కమేడియన్ కిరాక్ ఆర్పీ పలు మార్లు ఈ ఆరోపణలు చేశారు. అంతే కాదు.. టీటీడీ చైర్మర్ బీఆర్ నాయుడు కూడా ఆ చిట్టా అంతా తమ దగ్గర ఉందనీ, ఇదో పెద్ద కుంభకోణమనీ చెప్పడమే కాకుండా త్వరలోనే అన్ని విషయాలూ బయటపెడతామన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా తెలిసి తెలిసీ వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నాం.. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయంటున్నారు. రోజా మాటలు వాస్తవమే అయితే ఆమె వేంకటేశ్వరస్వామి విషయంలో తప్పు చేసినట్లు అంగీకరించేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
అయితే విచిత్రమేంటంటే.. అంత భయ పడుతూ కూడా ఎందుకిలా చేశారన్నది ఇప్పుడో చర్చగా మారింది. సింథటిక్ నెయ్యితో స్వామివారికి లడ్డూలు చేసి పెట్టిన పాపం ఊరకే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈ దర్శనాలను మాత్రం ఆమె మానరు. మధ్యమధ్యలో కాశీ కూడా వెళ్లి వస్తుంటారు. పాపం చేశాను.. పరిహారం చూపండి అనో ఏమో రోజా ఈ దేవుళ్లను క్రమం తప్పకుండా దర్శించుకుని వస్తుంటారు.
అవన్నీ పక్కన పెడితే వైసీపీలో రోజా కు ఏ మంత ప్రాముఖ్యత కనిపించడం లేదు. సోంత నియోజకవర్గం నగరిలో స్థానిక వైసీపీ నేతలు ఆమెపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో..వచ్చే ఎన్నికలలో ఆమెకు వైసీపీ టికెట్ దక్కకుండా వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. ఇక ఏపీలో లాభం లేదు తమిళనాడు వెళ్లిపోయి.. టీవీకేలో సెటిల్ అవ్వడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదంటున్నారు. మరిప్పుడు గత్యంతరం లేక వైసీపీలో గుర్తింపు కోసం చంద్రబాబును భల్లాల దేవుడు, జగన్ ను బాహుబలి అంటూ సినిమా డైలాగులతో రాజకీయం చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-roja-tenssion-25-213643.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.