Publish Date:Jun 30, 2026
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం (జూన్ 30) మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుడివాడ అమర్నాథ్ పై తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మేకప్ మంత్రి అంటూ గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ ఆయనకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.
అయితే గతంలో రెండు సార్లు విచారణకు హాజరు కావడానికి గడువు కాలాలంటూ కోరిన గుడివాడ అమర్నాథ్ ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అదలా ఉంటే.. తనపై ఆరోపణలపై అప్పట్లోనే స్పందించిన ఆయన.. తాను హోమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలూ సహజమేనన్న ఆయన వాటిని అడ్డం పెట్టుకుని తనపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సాధారమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-gudivada-amarnath-appears-before-the-womens-commission-36-224618.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.