కాకాణి అరెస్టుపై అనిల్ కుమార్ ఖంగారెందుకో తెలుసా?

Publish Date:May 26, 2025

Advertisement

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు  ఆదివారం (మే 25) కేరళలో అరెస్టు చేసి ఏపీకి తరలించిన సంగతి తెలిసిందే.  క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో గుంటూరు రేంజ్ పోలీసులు   ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రోడ్డు మార్గంలో నెల్లూరులోని  డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం)కి తరలించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం (మే 26) ఉదయం కాకాణిని వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తరలించారు. తరువాత ఆయనను వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు   హాజరుపరిచే అవకాశం ఉంది.

ఇలా ఉండగా కాకాణి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు వార్త తెలియగానే ఆదివారం (మే 25) అర్ధరాత్రి నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళీ, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు.  మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టలేరనీ, త్వరలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.  ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షం పై కక్ష పూరితంగా వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.  

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడూ చూడని అరెస్టులను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులని విమర్శించారు.  అక్రమ కేసు పెట్టారు కనుకే మాజీ మంత్రి కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించార్న ఆయన న్యాయపోరాటం చేస్తామన్నారు. అయినా ఇన్నాళ్లూ పార్టీకీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చి ప్రభుత్వంపై నిప్పులు చెరగడం వెనుక తన అరెస్టు భయం ఉండటమే కారణం అంటున్నారు.

ఎందుకంటే ఇదే అనిల్ కుమార్ యాదవ్ గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. మంత్రిగా ఉండగా మీసం తిప్పి, తొడ చరిచి, ప్రభుత్వంపైనా, తెలుగుదేశం నేతలపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్.. అప్పట్లో జగన్ మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవిని పీకేసి.. నెల్లూరు జిల్లాకే చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్నసమయంలో  అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు కారణంగానే అప్పట్లో ఆయనను పార్టీ సమన్వయకర్త పదవి నుంచి  జగన్ తప్పించారన్న ప్రచారం కూడా ఉంది. ఇక 2024 ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయారా అన్న అనుమానాలు కూడా ఒక దశలో వ్యక్తం అయ్యాయి.  

వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్  ఓటమి తరువాత సైలెంటైపోయారు. వాస్తవానికి ఫలితాలకు ముందే, అంటే పోలింగ్ జరిగిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించార ఆరోపణలు చేయడం ద్వారా ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.   పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా  ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని హేళన చేశారు. రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు.

అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఆయన రాజకీయ భవిష్యత్ లో సందిగ్ధంలో పడింది.  ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మళ్లీ సవాళ్లతో  చెలరేగిపోతున్నారు.  అయితే.. అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలకు నేడో రేపో తన అరెస్టూ తప్పదని భావిస్తున్న అనిల్... అప్పుడు తనకు పార్టీ నుంచి మద్దతు కోసమే ఇప్పుడు కాకాణి అరెస్టును ఖండిస్తూ.. న్యాయపోరాటం, అక్రమ అరెస్టులకు భయపడం అంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.