పర్యావరణం పై రణం చేస్తే… పర్యవసానం దారుణం!

Publish Date:Jun 5, 2017

Advertisement

 

జూన్ 5… ప్రపంచ పర్యావరణ దినోత్సవం! ఇవాళ్ల మిగతా అన్ని స్పెషల్ డేస్ లో చేసినట్టే ప్రపంచ వ్యాప్తంగా జనం హడావిడి చేసేస్తుంటారు! స్పీచ్ లు, పాటలు, ఆటలు, టీవీ కెమెరాల హంగామా, ఆర్బాటం! ఇక సినిమా వాళ్లకంటే మరింత ఎక్కువ కెమెరా సెన్స్ వున్న పొలిటీషన్స్, ప్రకృతి ప్రేమికులు మొక్కలు పట్టుకుని ఇచ్చే ఫోజులైతే  మరీ సుందరంగా వుంటాయి! కాని, రేపట్నుంచీ ఏంటి పరిస్థితి? నిన్నటి దాకా ఏం జరిగిందో అదే! పర్యావరణంపై దారుణమైన రణం! చెట్లను నరుకుతూ…మనిషి కూర్చున్న కొమ్మనే నరుక్కునే పని దిగ్విజయంగా చేసేస్తుంటాడు!

 

సంవత్సరానికి ఓ సారి పర్యావరణం కోసం ఓ రోజు కేటాయించుకోవటం తప్పు కాదు! కాని, అసలు పర్యావరణం కోసం ఒక దినోత్సవం పెట్టుకోవాల్సిన ప్రమాదం ఎందుకు వచ్చింది? మనిషి స్వార్థం వల్ల! అభివృద్ధి అనే అందమైన క్యాన్ లోంచి మనం ప్రమాదం అనే ఇంధనం తీసి ఒంటి మీద పోసుకుంటున్నాం! ఇక అది ఎప్పుడు భగ్గున అంటుకుంటుందో ఎవరికీ తెలియదు! ఒబామా, ట్రంప్ మొదలు చిన్నా చితకా ఎన్జీవోలు నడిపే ఉద్యమకారుల వరకూ అందరూ పర్యావరణం ఎంతో ముఖ్యమనే అంటారు. కాని, సంవత్సరం తిరిగే సరికల్లా మన సీఎంలు, పీఎంలు నాటిన మొక్కలు మేకల నోట్లలోకి వెళ్లిపోతాయి! భూమీ మీది పచ్చదనం గతం కంటే ఇంకింత కుంచించుకుపోతుంది!

 

1880 నుంచీ 2013వ సంవత్సరం దాకా మన దేశంలో అడవులు ఎంతగా తగ్గిపోయాయో తెలుసా? 40శాతం! అడవులు వుంటేనే మనిషి బతకగలడని ఇంగితం వున్న ఎవరికైనా ఈ విషాదం ఒళ్లు గగుర్పొడిపిస్తుంది! మళ్లీ 40శాతం అడవులు భారతదేశంలో పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ఊరికే మీడియా ముందు ఒక అడుగు లోతు గుంటలో మూరెడు మొక్కొక్కటి నాటేస్తే అడవులు తయారైపోతాయా? అంతే కాదు, ప్రస్తుతం భారతదేశంలో అడవుల రూపంలో వున్న భూమి 24శాతం! కనీసం 30-35 శాతం భూమి అడవులతో పచ్చగా వుండకపోతే తీవ్రమైన ప్రమాదం! కాని, వున్న 24శాతం అడవుల్ని కూడా అరగదీసే ఆలోచనలే నడుస్తున్నాయి!

 

అడవుల్ని రక్షించుకోవాలంటే విచ్చలవిడి అభివృద్ధి కుట్రలు మానాలి. పెరిగిన జనాభకి తగ్గట్టుగా ఉపాధి కోసం అభివృద్ధి అవసరమే కాని అది పర్యావరణాన్ని నాశనం చేసి అస్థిత్వానికే గండం తెచ్చేది కాకూడదు. అడవుల్ని తగ్గకుండా చూసుకుంటే పెరిగేలా చేయటమే అసలైన అభివృద్ధి. రోడ్లు, భవనాలు, బ్రిడ్జ్ లు, నీటి ప్రాజెక్ట్ ల కోసం అడవుల్ని తుడిచి పెట్టేయటం అభివృద్ధి కాదు! అది ఆత్మహత్య! ఈ సత్యం మనం గ్రహించాలి. మనమే కాదు ప్రపంచం మొత్తం పర్యావరణం విషయంలో శ్రీరంగ నీతులే చెబుతోంది! పాటించే దగ్గరికి వచ్చే సరికి మాత్రం అమెరికా మొదలు ఆఫ్రీకా దేశాల దాకా అన్నీ కాలుష్యానికి కాలుదువ్వుతున్నాయి. మనకున్న ఒకే ఒక్క భూమండలాన్ని మాడిపోతోన్న పెనంలా మార్చేస్తున్నాం!

 

పచ్చదనాన్ని కాపాడే ప్రయత్నాలు నిజంగా చేయదలిస్తే ముందు ఏం చేయాలి? అడ్డగోలు రూల్సు పెట్టి అడవుల చుట్టుపక్కల గ్రామాల నిరుపేదల్ని ఇబ్బంది పెట్టడం కాదు. అడవిలోకి పోయి కట్టెలో, తేనో, ఆకులు, అలములో తెచ్చుకునే పూట గడవని వార్ని మన వాళ్లు జైల్లో కూడా పెడుతుంటారు! కాని, స్మగ్లింగ్ కో్సం వేల చెట్లు తెగ నరికే వార్ని పట్టుకోలేకపోతున్నామని చెబుతూ వదిలేస్తుంటారు! ఫ్యాక్టరీలు లక్షల మైళ్ల అడవుల్ని తుడిచి పెట్టేస్తుంటే మౌనం వహిస్తారు! ఇవన్నీ అసలు సమస్యలు!

 

పర్యావరణాన్ని మనం సరైన సమయంలో కాపాడుకోకపోతే… తరువాత అది తెచ్చే ప్రళయం నుంచీ మనల్ని కూడా ఎవరూ కాపాడలేరు. ఈ సత్యం గ్రహించి ఒకప్పటిలా మనం ప్రతీ చెట్టునీ, పుట్టనీ దైవంగా భావించి ఆరాధించాలి. పచ్చ నోట్ల కంటే పచ్చదనం ఎంతో ముఖ్యమని అర్థం చేసుకుని తరువాతి తరాలకి భూమిని అత్యంత భద్రంగా అప్పజెప్పాలి!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.