ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. పత్తా లేని మంత్రులు

Publish Date:Jul 23, 2022

Advertisement

గోదావరి వరద చరిత్రను తిరగ రాసింది. 36 ఏళ్ల తర్వాత గోదారమ్మ మరోసారి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వరదనీటి ప్రవాహానికి నదీ పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వందలాది లంక గ్రామాల ప్రజలు వరదనీటి మునకలో నరకయాతనలు పడుతున్నారు. అనేక లంక గ్రామాల్లో వరదనీరు 18 నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రవహించింది. కొన్ని మండలాల్లో ఏ లంక గ్రామం ఎక్కడ ఉందో తెలియనంతగా వరదనీరు వెల్లువెత్తింది. గోదావరినదీ పాయలు వశిష్ట, వైనతేయి, గౌతమి భీకరరూపం దాల్చి ప్రవహించాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని పలు గ్రామాలు కూడా వరద ఉధృతితో అల్లాడిపోయాయి.

ప్రకృతి విపత్తు ఊళ్లకు ఊళ్లపైన ఇంతలా విరుచుకుపడినా ఏపీలోని ఏ మంత్రి కూడా వరద బాధిత ప్రాంతాలను కన్నెత్తి చూడడం లేదని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన తాము అసలు బతికి ఉన్నామో చచ్చామో కూడా చూసేందుకు కూడా ఒక్క మంత్రి కూడా రాలేదని దుయ్యబడుతున్నారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, పిల్లలకు పాలు లేక, కొంపా గోడు కూలిపోయి, ఇంట్లోని సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయి, పాడైపోయినా తమను ఏ ఒక్క మంత్రీ కనీసం పలకరించకపోవడం, పరామర్శించకపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద బీభత్సంతో 50 వేల మందికి పైగా ప్రజలు అల్లాడిపోయారు. అయినప్పటికీ వారిని పరామర్శించేందుకు కనీసం ఒక్క వైసీపీ నేత గాని, ఒక్క మంత్రి గానీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఒక పక్కన ఎక్కడికక్కడ టీడీపీ స్థానిక నేతలు తమకు తోచిన మేరకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఆహారం, తాగునీరు లాంటివి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గుండెలోతు వరదనీటిలో కూడా స్వయంగా తమ వద్దకే వచ్చి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సహాయ సహకారాలు అందించారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల కానీ ఒక్కరు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదని శాపనార్థాలు పెడుతున్నారు.

సీఎం జగన్ రెడ్డి కూడా ఏదో గాల్లో వచ్చి గాల్లోనే తిరిగి.. తమను గాలికి వదిలేసి తుర్రుమన్నారే తప్ప నేరుగా తమ ఇబ్బందుల గురించి ఒక్క మాట అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరద బీభత్సంలో కూడా మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి తమను పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకోవడం పట్ల వరద పీడిత ప్రాతాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిలో పడవ ప్రమాదం జరిగి, టీడీపీ సీనియర్ నేతలు నదిలో పడిపోయారు. అయితే.. అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి వెళ్లడంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా ప్రాణాలకు తెగించి కూడా టీడీపీ అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు తమకు అండగా నిలబడితే.. వైసీపీ నేతలకు ఏ మాయ ముంచుకొచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే.. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు మంత్రులు వరద ప్రాంతాలకు వచ్చి, చూసి వెళ్లారంటే.. కనీస సాయం అందించలేదని, మాట వరసకు కూడా ఒక్క హామీ ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక పక్కన చంద్రబాబు సహా టీడీపీ నేతలు వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, భరోసాగా నిలిస్తే.. ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందం’గా సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. జగన్ ఎంతసేపూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అడ్డదారుల్లో అయినా మళ్లీ ఎలా అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయమే తప్ప తమను పట్టించుకోవడంలేదని ఫైరవుతున్నారు. ఒక పక్కన లక్షలాది మంది జనం వరద ముంపులో నానా అగచాట్లు పడుతుంటే.. జగన్ మాత్రం జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, నియోజకవర్గం, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల గురించి చర్చలతో కాలక్షేపం చేయడమేంటని నిలదీస్తున్నారు.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.