వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

Publish Date:Aug 27, 2022

Advertisement

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది. 

ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది. 

 ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు

By
en-us Political News

  
నో డౌట్.. జగన్‌కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్.
నీట్‌ పరీక్షలో అక్రమాలకు గుజ‌రాత్ కేంద్రంగా మారింది. గుజరాత్ లోని ఓ నీట్ యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 లక్షల రూపాయ‌లిస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దివంగత వైఎస్ సతీమణి, ఏపీ సీఎం జగన్ కన్న తల్లి, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తాను ఎవరివైపో స్పష్టంగా చెప్పేశారు. తన కుమార్తె షర్మిలకే తన మద్దతు అని విస్పష్టంగా ప్రకటించేశారు.
హైదరాబాద్ బిజెపి ఎంపీ  అభ్యర్థి మాధవీలత పోలీసులకు  మాస్ వార్నింగ్  ఇచ్చారు. పోలింగ్ కు ఇంకా రెండు రోజులు కూడా లేకపోవడంతో ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దత్తు ఇస్తుందని ఆరోపిస్తున్న మాధవీలత నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులను ఊరుకునేది లేదని హెచ్చరించారు.
2019 ఎన్నికల్లో నేను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందాను. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాను. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం నన్ను కట్టిపడేశాయి. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నాను.
ఇప్పటికే తమ భూముల పాస్‌బుక్‌ల మీద ప్రత్యక్షమైన జగన్, దేశంలో ఎక్కడా లేని కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా తమ భూములు తమకు కాకుండా పోతాయన్న భయం అందరిలోనూ వుంది.
కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి విజయమ్మ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నేను మీ విజయమ్మను. రాజశేఖరరెడ్డిని
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కీలక సూచన చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం (మే13)న ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల కిందటి వరకూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం వేరు. ఇప్పుడు వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నాలుగైదు నెలల కిందటి వరకూ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అన్న భావన గట్టిగానే వ్యక్తమయ్యేది. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల వార్ వన్ సైడేనని సామాన్య జనం కూడా అంటున్నారు. తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వేవ్ ఉందని చెబుతున్నారు. నమ్ముతున్నారు.
కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో
బూతుల ఫ్యాక్టరీ, గుట్కా బస్తా అని గిట్టనివారు పిలుచుకునే కొడాలి నానికి ఇప్పుడు కొత్త పిచ్చి పట్టింది. కొడాలి నాని నోరు తెరిస్తే గుట్కా కంపు ముందు వస్తుందో, బూతుమాట ముందు వస్తుందో నిజానికి ఆయనకి కూడా తెలియదు.
సింహం సింగిల్ గానే వస్తుంది. ఎంత మంది కలిసినా వా వెంట్రుక కూడా పీకలేరు. వైనాట్ 175, అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలకు సంకేమం సొమ్ములు క్రమం తప్పకుండా బటన్ నొక్కి పంచాను. వాళ్లంతా నాకే ఓటేస్తారు. ఇవీ జగన్ నిన్నమొన్నటి దాకా గంభీరంగా చెప్పిన మాటలు. మరి ఆ ధైర్యం, స్థైర్యం ఏమైపోయాయో.. ఇప్పుడు బేలగా, దీనంగా మాట్లాడుతున్నారు.
వల్లభనేని వంశీ.. ఇటీవలి కాలంలో ప్రజలలో బాగా నానుతున్న పేరు. అదేదో ఆయన గొప్ప పనులు చేసేశారని కానీ, సమాజ సేవలో మునిగి తేలుతున్నరాన్న ప్రశంసలతో కానీ కాదు. అడ్డగోలు రాజకీయం, తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టే నైజంపై వెల్లువెత్తుతున్న విమర్శల కాలంగా ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రజలలో బాగా చర్చకు వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.