Publish Date:Aug 31, 2022
ఒక బొమ్మ కోసం ఒకమ్మాయి లవర్తో గొడవపడి బొమ్మ తెచ్చిస్తేనే నిన్ను పెళ్లాడతానని అంటుంది. వాడు వూరంతా తిరిగి ఓ దుకాణంలో అలాంటిదే కొనిస్తాడు. ఆమె పరిశీలనగా చూసి బొమ్మని పారేసి, సదరు ప్రేమికుడిని ఇక కలవద్దని వారిస్తుంది. కావడానికి ఇదో సినిమా సీన్. కానీ ఆ బొమ్మకి ఆ అమ్మాయికి ఉన్నఅనుబంధం గట్టిదే. అది తాను టెన్త్లో ఉండగా వాళ్ల డాడీ కొనిచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత దాంతోనే ఎక్కువ మాట్లాడుతూండేది. అదో బంధం. అది అందరికీ అర్ధమయ్యేది కాదు. దానితో మాట్లాడుతూంటే తండ్రితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇదో సెంటిమెంటు కూడా. అందువల్ల అలాంటి వస్తు వులు ఎవరూ వదులుకోరు, పారేసుకోరు. ప్రాణంతో సమానంగా చూసుకునే బ్రాస్లెట్ పోగొట్టుకున్న కుర్రాడు మరెంతగా బాధ పడుతున్నాడో. అది తెచ్చిచ్చినవారికి తగిన బహుమతి ఇస్తానని ఏకంగా ఫ్లెక్సీ పెట్టేడు!
తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన బ్రాస్లైట్ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా పొన్నామరావతికి చెందిన నారాయణన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తల్లి కానుకగా ఇచ్చిన బ్రాస్లెట్ను ఆమె మరణా నంతరం జ్ఞాపకంగా నారాయణన్ ధరిస్తున్నాడు. ఆగష్టు 22వ తేది ఉసిలంపట్టిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన నారా యణన్ బ్రాస్లెట్ కనిపించకపోవడంతో దిగ్ర్భాంతి చెందాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తాను వెళ్లి వచ్చి న దారిలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు.
అందులో తల్లి జ్ఞాపకంగా ఉన్న బ్రాస్లెట్ కనిపించలేదని, అందజేసిన వారికి తగిన బహుమతి అందిస్తానంటూ పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీ ఉన్న దారంట వెళ్లేవారు ఈసరికే చాలామంది నవ్వుకుని ఉంటారు. నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని లవర్స్ పెట్టుకోవడం చూశాంగాని వీడెవడండీ, పోయిన వస్తువు కోసం ఇలా ప్రచారం చేస్తారా? వెర్రిగాని! అంటూ ఎగతాళిగా నవ్వు కున్నారు కొందరు యువకులు. కానీ అంత ప్రచారం చేస్తున్నాడంటే దాని వెనక ఉన్న అనుబంధ బలం అలాంటిది. తల్లి లేని లోటు తీర్చడం చాలా కష్టం. ఆమె యిచ్చిన బ్రాస్లెట్తో కాలం గడుపుతున్నవ్యక్తికి అది కూడా దూరమయితే నరక యాతనే. అది చేతికి ఉంటే అమ్మచేతిని పట్టుకుని నడుస్తున్నట్టే ఉంటుంది. ప్లీజ్.. బ్రాస్లెట్ దొరికితే ఇచ్చేయండి... అతనికి తల్లిని దరిచేర్చినట్టవుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flexi--request-for-lost-bracelet-25-142988.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.