Publish Date:May 23, 2023
చేప మందులో శాస్ట్రీయత కంటే నమ్మకమే చేప ప్రసాద వితరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చేసింది. దూద్ బౌలిలో చేప మందును తయారు చేసి వితరణ చేసే కార్యక్రమం చాలా సంవత్సరాలనుంచి కొనసాగుతుంది. కొందరు హేతువాదులు చేప మందు మీద నానా యాగి చేశారు చేప మందులో వాడే మందుకు శాస్త్రీయత లేదని, అందులో వాడే ముడి సరుకులో ఎటువంటి పస లేదని కొందరు గతంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో చేప మందు కాస్తా చేప ప్రసాదంగా మారిపోయింది. కరోనా కారణంగా గత మూడేళ్ల నుంచి ఈ చేప ప్రసాద వితరణ ఆగిపోయింది. చేప మందు ప్రసాద వితరణలో నమ్మకమే వైద్యంగా మారింది. అస్తమాను తగ్గించే ఉత్ప్రేరకాలు ఇందులో లేవని హేతువాదులు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. ప్రజల నమ్మకమే పరమావధి అని బిఆర్ఎస్ సర్కారు భావించింది. మంత్రి తలసాని ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. జూన్ 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదాన్ని వితరణ చేస్తామన్నారు. ఒకప్పుడు రైల్వేశాఖ అస్సాం నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు నడిపింది అంటే చేప ప్రసాదానికి ప్రాశస్త్యం అలాంటిది.
చేప ప్రసాదంలో బతకున్న కొర్ర మీను చేపపిల్ల నోట్లో చేప ప్రసాదాన్ని పెట్టి ఆ చేపను మన గొంతులో వేస్తారు. ఒకే వ్యక్తి వందలాది మందికి చేపపిల్లలను నోట్లో వేయడాన్ని పలువురు వ్యతిరేకించారు. నాన్ వెజ్ వాళ్లకు కూడా చేప ప్రసాదాన్ని ఈ యేడు కూడా ఇస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fish-medicin-at-jun-8-25-155804.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.