Publish Date:May 17, 2023
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి నాలుగేళ్లయినా.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం ఎంత సుందర ముదనష్టంగా అమలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మద్య నిషేధం మాట అటుంచి దిక్కుమాలిన జే బ్రాండ్ ల పేరుతో ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అంతే కాకుండా పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకున్నారు.
అంటే జగన్ గత ఎన్నికల ముందు చేసిన దశల వారీ మద్య నిషేధం అన్నది ఒక బూటకపు హామీ అన్నది తేటతెల్లమైపోతుంది. పైపెచ్చు మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచేయడం ద్వారా ప్రజలలో మద్యం అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ.. కొత్త కొత్త భాష్యాలు కూడా చెప్పారు. కాగా పొరుగున ఉన్న తమిళనాడులో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని స్టాలిన్ సర్కార్ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాలను మూసేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలకు కూడా ఉపక్రమించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జూన్ 3న కరుణానిథి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. తొలివిడతగా 500 దుకాణాలను మూసివేయనున్నారు. ఆ మేరకు ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు.
ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూత పడతాయని తెలుస్తోంది. అదే విధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం వాగ్దానం చేసి నాలుగేళ్లయినా మద్యం వినియోగం పెంచడమెలా అన్న ప్రణాళికలతో జగన్ సర్కార్ ముందుకు వెళుతోంది. ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని కూడా ఫణంగా పెడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/first-step-to-wards-alchohal-prohibition-39-155460.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది