Publish Date:Feb 10, 2020
అయోధ్య రామమందిర నిర్మాణానికి తొలి అడుగు త్వరలోనే పడనుంది. కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్టు తొలి సమావేశానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రస్ట్ లో నామినేటెడ్ సభ్యుల ఎంపికతో పాటు కీలక నిర్ణయాలను ఈ మీటింగ్ లో తీసుకోబోతున్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు తొలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 న ఢిల్లీ లోని ట్రస్టు శాశ్వత కార్యాలయంలో సమావేశం జరగనుంది. ట్రస్టు శాశ్వత కార్యాలయంగా గ్రేటర్ కైలాష్ లోని, ఆర్-20 భవంతిని ఎంపిక చేశారు. ఈ కార్యాలయం ట్రస్టు చైర్మన్ పరాశరన్ కు చెందినది.
కేంద్రం ఇది వరకే జారీ చేసిన నోటిఫికేషన్ లోని అంశాల మేరకు తొలిసారి భేటీ కానున్న అయోధ్య టెంపుల్ ట్రస్టు ఆ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరుగురు నామినేటెడ్ సభ్యుల ఎంపిక కూడా అదే రోజున జరగనుంది. రామజన్మభూమి ట్రస్టులో మొత్తం పదిహేను మంది సభ్యులు ఉంటారని ప్రకటించిన కేంద్రం వారిలో తొమ్మిది మంది శాశ్వత, ఆరుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారని తెలిపింది. చైర్మన్ పరాశరంతోపాటు వాసుదేవానంద్, మాధవాచార్య స్వామి, యుగపురుషు పరమానంద, స్వామి గోవిందదేవ్, విమలేంద్ మోహన ప్రతాప్ మిశ్రా, డాక్టర్ అనిల్ మిశ్రా, పాట్నాకు చెందిన కమలేశ్వర్ చోపాల్, నిర్మోహి అఖాడా చీఫ్, మహంత ధీరేంద్ర దాస్ శాశ్వత సభ్యులుగా ఉన్నారు.
రామజన్మభూమి ట్రస్టు తొలి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాత్కాలిక సభ్యులుగా ఎవరిని ఎన్నుకుంటారు, ఎలాంటి విధి విధానాలను ప్రకటిస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకొనే పూర్తి స్వేచ్ఛ శ్రీరామజన్మభూమి ట్రస్టుకు ఉంటుందని, విరాళాల సేకరణ, పెట్టుబడుల వంటి వ్యవహరాలు అదే చూసుకుంటుందని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. అయోధ్య టెంపుల్ ట్రస్టు ఎప్పటికప్పుడు లెక్కలు పక్కాగా రాయాలని నిర్ణీత కాలవ్యవధిలో ట్రస్టు ఖాతాలను ఆడిట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/first-meeting-of-ram-temple-trust-likely-on-feb-19-25-94059.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.