Publish Date:May 23, 2022
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయాలే టార్గెట్గా వైసీపీ దాడులు జరుగుతున్నాయి. నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షురాలు కె.రేవతిపై ఆదివారం దాడి జరగగా.. నాయుడు పేటలోని టీడీపీ కార్యాలయంపై ఆదివారం అర్థరాత్రి దుండగులు దాడి చేశారు.
కార్యాలయం తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే కార్యాలయంలోని ఫర్నిచర్ సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగుదేశం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ హుటాహుటిన నాయుడుపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దాడికి బాధ్యులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసుకు విజ్జప్తి చేశారు. నిన్న నగర మహిళా టీడీపీ అధ్యక్షురాలిపై దాడి జరిగిన కొన్ని గంటల్లోనే టీడీపీ కార్యాలయంపై దాడి చేసి నిప్పు పెట్టడంపై పనబాక లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక ఉన్నది వైసీపీయే అని ఆరోపించారు. అధికార మదంతో వైసీపీ వారు ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నరని విమర్శించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపిందని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ జగన్ ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ఆయన వివిధ జిల్లాల్లో రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఓ చర్చ అయితే నెల్లూరులో సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-to-tdp-office-in-nayudupeta-25-136324.html
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.