తాడేపల్లి ప్యాలెస్ బయట మంటలు.. ఇది గులకరాయా? కోడి కత్తా

Publish Date:Feb 5, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు ఆవలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనిని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.  మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై వైసీపీ చేస్తున్న అతి చూస్తుంటే అనుమానంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ నివాసం బయట రోడ్డు పక్కన బుధవారం సాయంత్రం రెండు సార్లు మంటలు వచ్చాయి. తీరా చూస్తే అది చాలా చిన్న అగ్ని ప్రమాదం. దీనికే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఈ స్వల్ప అగ్నిప్రమాదం కూడా జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా రోడ్డుకు ఆవలి పక్కన జరిగింది. ఈ స్వల్ప అగ్నిప్రమాదంపై జగన్ బ్యాచ్ చేస్తున్న హడావుడీ హంగామా చూస్తుంటే..  గతంలో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, గులకరాయి దాడులు గుర్తుకు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఇలా ఉండగా అది ప్రమాద వశాత్తూ జరిగింది కాదనీ,   జగన్ హయాంలో మద్యం స్కాంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేయగానే.. తాడేపల్లి పునాదులు ఎక్కడ కదిలిపోతాయోన్న భయంతో  ఆ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు, డైరీలను వైసీపీయులే తగలబెట్టేసి, అగ్ని ప్రమాదం, భద్రతా లోపం అంటూ కథలల్లుతున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భూ దందాకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేయడానికి ఏకంగా మదనపల్లి తహశీల్దార్ కార్యాలయంలోనే అగ్నిప్రమాదాన్ని సృష్టించిన ఘనత వైసీపీదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

నిజంగానే  భద్రతా లోపం కారణంగా జరిగిన అగ్నిప్రమాదం అయితే బుధవారం సాయంత్రం మంటలు చెలరేగితే దాని సీసీ ఫుటేజీని ఇంత వరకూ ఎందుకు బయటపెట్టలేదని తెలుగుదేశం ప్రశ్నిస్తున్నది.  తానే దాడులు చేయించుకుని తానే ఎదుటి వారిపై నిందలు వేయడం జగన్ కు అలవాటేనంటూ తెలుగుదేశం ట్వీట్ చేసింది.  తానే తగులబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? అంటూ నిలవీసింది. ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్' అని ఆ ట్వీట్ లో పేర్కొంది. తెలుగుదేశం, వైసీపీల విమర్శలు ఆరోపణలు అలా ఉంచితా.. అసలు అగ్ని ప్రమాదం జరిగిన తీరే చాలా అనుమానాస్పదంగా ఉంది.  మంటలు వస్తున్నా జగన్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని ఆర్పండంపై కాకుండా వీడియోలు తీయడంపైనే శ్రద్ధ చూపడం ఉద్దేశపూర్వకంగానే అక్కడ వేటినో తగులబెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అన్నిటికీ మించి అతి స్వల్పంగా వచ్చిన మంటలపై వైసీపీ ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు చేస్తున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   

అగ్ని ప్రమాదం మాటున, జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం కూటమి  సిట్   వేయగానే  జగన్ ఇంటి ముందు స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం.. ఆ ప్రదేశంలో కొన్ని కాగితాలు కాలి ఉండటంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. 

జగన్ విదేశీ పర్యటన ముగించుకుని, ఆ తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని చాలా రోజుల తరువాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంపై సీట్ ఏర్పాటు చేసిందని తెలియడంతోనే ప్యాలెస్ లో  ఉన్న మద్యం కుంభకోణానికి సంబంధించి పత్రాలను బయటపడేసి తగులబెట్టించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తాడేపల్లి ప్యాలెస్ లో  దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ వీడియోలు తీయగల అధునాతన సీసీటీవీ లు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను బయటపెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదం వివరాలన్నీ బయటకు వస్తాయి. అయితే ఆ పని చేయకుండా జగన్ పై హత్యాయత్నం, ఇళ్లు తగలెట్లే యత్నం అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊరూవాడా ఏకమయ్యేలా చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి దాడి, గులకరాయి దాడి సందర్భంగా వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇక్కడా సానుభూతి ప్రోది చేసుకోవడానికి పడుతున్న తాపత్రయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సానుభూతికి తోడు.. మద్యం కుంభకోణం ఫైళ్లను కూడా దగ్ధం చేసేసి ఒకే దెబ్బకు రెండు లాభాలు పొందే అవకాశం కోసం అర్రులు చాచినట్లుగా కనిపిస్తోందంటేన్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (మార్చి 21) శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ఒకప్పుడు, సీనియర్లను పక్కన పెట్టి, జూనియర్ నాయకులకు, మరీ ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన, చిట్టి పొట్టి నాయకులకు ఎత్తు పీట వేసి పెద్ద చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడు, సీనియర్ల వైపు చూస్తోందా? అంటే, కాంగ్రెస్ వర్గాల నుచి అవుననే సమాధానమే వస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో భాగంగా ఉన్న పార్టీనే గానీ.. ప్రజాస్వామికంగా నడిచే పార్టీ కాదు. ఒక వ్యక్తి స్థాపించి.. తానే ఆ పార్టీకి మోనార్క్ అని భావించుకుంటూ.. నియంతలా నిర్వహిస్తున్న పార్టీ అది.
ఛత్తీస్ గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో  ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి.
 టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ధన శ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు గురువారం (మార్చి 20)తో తెరపడింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయాన్ని చాహల్ తరపు న్యాయవాది కన్ఫర్మ్ చేశారు. ధన శ్రీకి భరణం క్రింద రూ 4. 75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. విడాకులు కేసు తుది దశకు చేరుకోవడంతో చాహల్ ఇంకా ఐపిఎల్  టీమ్ లో చేరలేదు
మన దేశం మరో మారు మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) పోటీలకు వేదిక అవుతోంది. అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.
 టిడిపి కార్యాలయంపై దాడి కేసులో  నిందితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  మూడు రోజుల పాటు సిఐడి కస్టడీ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారి చేసింది.
ఫోట్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌ శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్‌ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసి అందరివాడుగా నిలిచిన మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కీర్తికిరీటంల మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మ విభూషన్ పురస్కారాలు అందుకున్న చిరంజీవి తాజాగా బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రజాప్రతినిథులు, ప్రముఖుల సమక్షంలో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం (మార్చి 19) ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీ తరువాత చంద్రబాబు ఎక్స్ వేదిగా ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఈ భేటీ అత్యంత కీలకం అంటూ పేర్కొన్నారు.
వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.