నాయక్ కు చురకలు వేసిన కుర్ర హీరో
Publish Date:Jan 13, 2013
Advertisement
మొన్న విడుదలయిన ‘నాయక్’ సినిమా మరో మాస్ సినిమా అయినప్పటికీ, దర్శకుడు వినాయక్ సినిమాను మలిచిన తీరుకి మాస్ ప్రేక్షకులు పడిపోయారని చెప్పవచ్చును. కమర్షియల్ సినిమాకి ఉండవలసిన అన్ని హంగులూ అమర్చిన ఈ సినిమాకి మాస్ ప్రేక్షకులు నీరాజనం పడుతుంటే, మిగిలిన వారితో బాటు మహేష్ అభిమానులు కూడా సీతమ్మ వాకిట్లోకి వెళ్లి కూర్చొంటున్నారు. ఇంత మంచి సినిమా తీసినందుకు నిర్మాత దిల్ రాజు పై ప్రశంసల జడివాన కురుస్తోందిప్పుడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్లనే, అభిమానులతో బాటు, సినీ పరిశ్రమకు చెందినవారు కూడా రెంటినీ పోల్చి తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు కొట్టేవారు ఇద్దరున్నారు. ఒకరు రామ్ గోపాల్ వర్మ కాగ, మరొకరు లవర్ బాయ్ గా పేరుపడ్డ హీరో సిద్దార్థ్. అతను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి తన ట్వీటర్ లో ఏమి వ్రాసాడంటే, ఈగ సినిమా తరువాత విడుదలయిన సినిమాలలో ఈ సినిమా ఒక్కటే సకుటుంబ సమేతంగా చూడదగినది. ఈ రోజుల్లో విడుదలవుతున్నమూస ఫార్ములా సినిమాలకి, అందులో ఉండే విపరీతమయిన హింసకి భిన్నంగా సీతమ్మ వాకిట్లో సినిమా చాలా అద్భుతంగా తీసారు. అందుకు సినిమా నిర్మించినవారితో బాటు, సినిమాలో నటించిన వెంకటేష్, మహేష్ బాబులకి కూడా నా అభినందనలు,” అని వ్రాసాడు. నాయక్ సినిమా గురించి సిద్దార్థ్ ప్రత్యక్షంగా ఏమి అనకపోయినా, అతను ఎవరిని గిల్లేడో అర్ధం అవుతూనే ఉంది. నాయక్ సినిమా సీతమ్మతో కాకుండా మరెప్పుడు విడుదలయి ఉంటే, బహుశః ఇటువంటి చర్చ వచ్చేదికాదేమో. అయితే, రెండు విబిన్నమయిన సినిమాలు ఈవిదంగా ఒకేసారి విడుదల కావడంవల్లనే తెలుగు ప్రేక్షకులు ఏమి కోరుకొంటున్నారో స్పష్టంగా తెలియజేసారు. ఇది మన తెలుగు చిత్ర సీమకి తప్పక మేలు చేస్తుందని ఆశిద్దాము.
http://www.teluguone.com/news/content/film-nayakm-film-svsc-24-20386.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





