సినీ పరిశ్రమకు ఉద్యమ సెగ

Publish Date:Aug 24, 2013

Advertisement

 

రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీఅయోమయంలోపడ్డాయి. అదేవిధంగా రాజకీయాలతో పెనవేసుకుపోయిన సినీపరిశ్రమ పరిస్థితి కూడా ఇప్పుడు అయోమయంలో పడింది. దాదాపు రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మింపబడిన నాలుగు పెద్ద సినిమాలు-పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు’, ‘తుఫాన్’ మరియు ‘జంజీర్’(హిందీ) సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కేంద్రమంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయనందున సమైక్యవాదులు అడ్డుపడటంతో ఈ మెగా హీరోల సినిమాల విడుదల కాలేకపోయాయి. కనీసం ఎప్పుడు విడుదల అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 

రెండు మూడు రోజుల క్రితం చిరంజీవి తను సమైక్యాంధ్ర కోరుకొంటున్నానని ప్రకటించినప్పటికీ ఉద్యమకారుల నుండి సానుకూల ప్రతిస్పందన లేదు. అయితే, ఆయన ఆవిధంగా ప్రకటించడం వలన ఒకవేళ సీమాంధ్ర ప్రాంతంలో ఈ ఇద్దరు మెగా హీరోల సినిమాల విడుదలకు మార్గం సుగమం కావచ్చునేమో కానీ ఇప్పుడు తెలంగాణావాదులు అడ్డుపడటం ఖాయం.

 

రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం రాష్ట్రంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెంచి పోషించినందున రేపు రాష్ట్ర విభజన జరిగిన తరువాతయినా ఈ పరిస్థితిలోసానుకూల మార్పు వస్తుందా? అనే అనుమానం సినీపరిశ్రమను కలవరపరుస్తోంది.

 

ఇక తెదేపా రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడంతో, అయన కుమారుడు జూ.యన్టీఆర్ నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాను తెలంగాణాలో విడుదలకు అనుమతించమని ఓయు జేయేసీ ప్రకటించింది. ఇదే రూలు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నసినిమాకు కూడా వర్తిస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఇక, నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉన్నపటికీ రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా సినిమా విడుదల కాకపోవచ్చును.

 

పెద్ద సినిమాలు విడుదల కానందున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సినిమా థియేటర్లు ఖాళీగా ఉండటంతో చిన్న సినిమా నిర్మాతలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తమ సినిమాలను విడుదల చేసుకొంటున్నారు. అయితే అందరూ ఆ అదృష్టానికి నోచుకోవట్లేదు. కారణం కొన్ని సినిమాలు అనేక నెలల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకొన్నపటికీ ఇంత కాలంగా థియేటర్లు దొరకని కారణంగా సదరు సినిమాల నిర్మాతలు పీకల లోతు అప్పులలో కూరుకుపోయారు. అటువంటివారు ఇప్పుడు అవకాశం ఉన్నపటికీ తమ సినిమాలను విడుదల చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు.

 

సినిమా నిర్మాణం పూర్తయి చాల కాలం అయినప్పటికీ విడుదల కాకపోవడంతో నిర్మాతలకు ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఈవిధంగా సినిమా విడుదల వాయిదా పడుతుండటంతో, తరువాత విడుదల కావలసిన సినిమాలు కూడా వాయిదాపడవచ్చును. అదేవిధంగా నిర్మాణంలో ఉన్నసినిమాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి ఇప్పుడప్పుడే అంతం అయ్యే సూచనలు కనబడకపోవడంతో చిన్న,పెద్ద సినీ నిర్మాతలు తమ కొత్త సినిమాల నిర్మాణం వాయిదా వేసుకొంటున్నారు.

 

అంతిమంగా ఇది సినీ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మంది జీవితాలను చిద్రం చేయబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చిన్న సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా, గోడౌన్లుగా మార్చబడ్డాయి. ఇంకా చాలా థియేటర్లకి ఇదే గతి పట్టవచ్చును. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రేయనక పగలనక కష్టపడి నిర్మించిన సినిమాలు విడుదల కాని పరిస్థితులు ఉంటే ఏ నిర్మాత సినిమా నిర్మించే సాహసం చేయడు.

 

ప్రజలకు వినోదం పంచిపెట్టే సినీ పరిశ్రమ నేడు పెను విషాదం చవి చూస్తోంది. సినీ పరిశ్రమ ముక్కు పిండి కోట్ల రూపాయలు పన్నులు దండుకొనే ప్రభుత్వం కానీ, ఉద్యమాల కోసం బలవంతపు వసూళ్లు చేసే రాజకీయ పార్టీలు గానీ, దాని కష్టాలు పట్టించుకొనే పరిస్థితుల్లో లేవు. రాష్ట్రంలో ఇదే అనిశ్చిత పరిస్థితి మరికొంత కాలం సాగితే సినీ పరిశ్రమ మూతపడినా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.