Publish Date:Jul 12, 2025
పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ ద్వారా ఈ స్థాయిలో అమ్మకమా అంటూ పవన్ పై మరో మారు విమర్శలు గుప్పించారాయన. గత మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ని అధ్యక్షుడిగా చేయడం కోసం మెగా కాంపౌండ్ తీవ్రంగా ప్రయత్నించింది. నాగబాబు దగ్గరుండి మరీ ఈ ఎన్నికల్లో ఫైట్ చేశారు. పవన్ కూడా ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేశారు. ఒక్క ఈ ఇద్దరే కాదు మెగా కాంపౌండ్ మొత్తం ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరుఫున నిలబడ్డారు.
అయితే అది వేరు- ఇది వేరని అంటారు ప్రకాష్ రాజ్. బేసిగ్గా ఆయన నాస్తికుడు. కొంత వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి ప్రకాశ్ రాజ్. ఆయన నేపథ్యం అలాంటిది. డీపర్ కర్ణాటక నుంచి తన తండ్రి బెంగళూరు రావడం.. అక్కడ ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో చేరితే.. అక్కడొక నర్సుతో పరిచయం ప్రేమగా మారి ఆపై ఆమెనే పెళ్లాడారాయన. ఆ తర్వాత పుట్టిన సంతానంలో ఒకరు ప్రకాష్ రాజ్. ఎన్నేసి హిందూ సినిమాల్లో హిందూ పాత్రలు చేసినా.. సరే ఆయన బయట మాత్రం యాంటీ హిందూ- యాంటీ మోడీ- యాంటీ బీజేపీ- లాంగ్వేజ్ లో మాట్లాడతారు. అయితే ఇక్కడ పవన్ కి ప్రకాష్ రాజ్ కి ఉన్న గొడవేంటని చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేనంతగా హిందుత్వాన్ని భుజానికెత్తుకుని మోస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మొన్నటి మురుగన్ మానాడు, అటు పిమ్మట హరిహర వీరమల్లులో హిందుత్వ నినాదం.. ఇలా సినిమా పరంగా, రాజకీయ పరంగా ఆయన హిందుత్వాన్ని పబ్లిగ్గానే హ్యాండిల్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులాగా సనాతన్ బోర్డు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే కాషాయంలో తిరగడానికైనా వెనకాడ్డం లేదు. దేవాలయాలకు కూడా విరివిగా తిరుగుతున్నారు. వీటన్నిటినీ చూసిన ప్రకాష్ రాజ్.. ఆయనపై గత కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా కూడా అమ్ముడవుతారా? అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మరి ఈ కామెంట్ల కాట్లాటలో చివరికి ఎవరు గెలుస్తారు? అసలు పవన్ స్కెచ్ ఏంటి? మధ్య ప్రకాష్ రాజ్ ఈ గిచ్చుడేంటన్నది ఇటు పొలిటికల్ అటు సినిమా ఇండస్ట్రీలో వాడీ వేడిగా చర్చ నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fight-between-pawan-and-prakashraj-25-201825.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.