Publish Date:Jul 12, 2025
పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ ద్వారా ఈ స్థాయిలో అమ్మకమా అంటూ పవన్ పై మరో మారు విమర్శలు గుప్పించారాయన. గత మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ని అధ్యక్షుడిగా చేయడం కోసం మెగా కాంపౌండ్ తీవ్రంగా ప్రయత్నించింది. నాగబాబు దగ్గరుండి మరీ ఈ ఎన్నికల్లో ఫైట్ చేశారు. పవన్ కూడా ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేశారు. ఒక్క ఈ ఇద్దరే కాదు మెగా కాంపౌండ్ మొత్తం ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరుఫున నిలబడ్డారు.
అయితే అది వేరు- ఇది వేరని అంటారు ప్రకాష్ రాజ్. బేసిగ్గా ఆయన నాస్తికుడు. కొంత వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి ప్రకాశ్ రాజ్. ఆయన నేపథ్యం అలాంటిది. డీపర్ కర్ణాటక నుంచి తన తండ్రి బెంగళూరు రావడం.. అక్కడ ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో చేరితే.. అక్కడొక నర్సుతో పరిచయం ప్రేమగా మారి ఆపై ఆమెనే పెళ్లాడారాయన. ఆ తర్వాత పుట్టిన సంతానంలో ఒకరు ప్రకాష్ రాజ్. ఎన్నేసి హిందూ సినిమాల్లో హిందూ పాత్రలు చేసినా.. సరే ఆయన బయట మాత్రం యాంటీ హిందూ- యాంటీ మోడీ- యాంటీ బీజేపీ- లాంగ్వేజ్ లో మాట్లాడతారు. అయితే ఇక్కడ పవన్ కి ప్రకాష్ రాజ్ కి ఉన్న గొడవేంటని చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేనంతగా హిందుత్వాన్ని భుజానికెత్తుకుని మోస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మొన్నటి మురుగన్ మానాడు, అటు పిమ్మట హరిహర వీరమల్లులో హిందుత్వ నినాదం.. ఇలా సినిమా పరంగా, రాజకీయ పరంగా ఆయన హిందుత్వాన్ని పబ్లిగ్గానే హ్యాండిల్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులాగా సనాతన్ బోర్డు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే కాషాయంలో తిరగడానికైనా వెనకాడ్డం లేదు. దేవాలయాలకు కూడా విరివిగా తిరుగుతున్నారు. వీటన్నిటినీ చూసిన ప్రకాష్ రాజ్.. ఆయనపై గత కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా కూడా అమ్ముడవుతారా? అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మరి ఈ కామెంట్ల కాట్లాటలో చివరికి ఎవరు గెలుస్తారు? అసలు పవన్ స్కెచ్ ఏంటి? మధ్య ప్రకాష్ రాజ్ ఈ గిచ్చుడేంటన్నది ఇటు పొలిటికల్ అటు సినిమా ఇండస్ట్రీలో వాడీ వేడిగా చర్చ నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fight-between-pawan-and-prakashraj-39-201824.html
బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి.
జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు.
వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేషనల్ హైవే బ్లాక్ అవుతుందని.. అలా జరిగితే తమిళనాడులోని కరూరులో విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేదని సీపీ తెగేసి చెప్పారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ, ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు.
ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై రియాక్టయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాలతో సహా కంప్లయింట్ చేయాలని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని వారించారు. తాను ప్రత్యేకించీ ఆధారాలు చూపించనక్కర్లేదనీ.. తన ప్రెజంటేషన్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.
ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.
బిహార్లో ఎన్నికలపై మ్యాటిజ్-ఐఎఎఎన్ఎస్ పబ్లిక్ ఒపినియన్ పోల్ సంచలన సర్వేపోల్ వెల్లడించింది.
జూబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణించడం వల్ల అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సతీమణి మాగంట సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కూడా జూబ్లీ ఉపఎన్నికలో విజయంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉందని నిరూపించాలని భావిస్తోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది
స్టే ఇవ్వకుంటే పిటిషన్ వేస్తారా అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులో విచారణలో ఉన్న అంశంపై తాము విచారణ జరపజాలమని స్పష్టం చేసింది. గతంలో ఇదే పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విజయ్ కు ఫోన్ చేసి మద్దతు పలికారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనిపై డీఎంకేలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వాస్తవానికి విజయ్ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తమకు రాజకీయ శత్రువులు అని విజయ్ గతంలోనే ప్రకటించారు. బీజేపీ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ చూపుతూ కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.