Publish Date:May 10, 2024
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రైతులు టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమికి వినూత్నంగా మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన కౌలు రైతులు ఎన్టీయే కూటమి గుర్తులను తమ పొలంలో నారుతో వచ్చేలా చేయడం ద్వారా మద్దతు తెలిపారు. గోంగూర విత్తనాలను క్రమపద్ధతిలో మొలకెత్తించడం ద్వారా సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తుల రూపంలో నారు మొలకెత్తేలా చేశారు. అలాగే ‘ప్రతి చేతికి పని - ప్రతి చేనుకి నీరు’ అనే నినాదం కూడా మొలకెత్తిన నారు ద్వారా కనిపించేలా చేశారు. ‘అత్తోట కౌలు రైతులు’ అనే అక్షరాలు కూడా కనిపించేలా నారును మొలకెత్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల జీవితాలు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా లాండ్ టైటిల్ చట్టం నుంచి తమను కాపాడేది ఎన్డీయే కూటమేనని రైతులు భావిస్తున్నారు. అందుకే కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-support-to-tdp-39-175566.html
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగిలిన దాఖలాలు లేవు. విభజన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికలలోనూ జీరో స్థానాలతో రిక్త హస్తాలతో మిగిలిన పార్టీ.. 2024 ఎన్నికలలో మాత్రం రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాకపోయినా.. ఉనికి చాటుకోవడానికి చాలా చాలా కష్టపడింది.
తెలంగాణ సాధించిన పార్టీగా పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు పరిపూర్ణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రారంభమైన బీఆర్ఎస్ పతనం లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత పరిపూర్ణమౌతుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితం ఎలా ఉండబోతోందో సంకేతాలిచ్చేశాయి. ఇక మంగళవారం (జూన్ 4) అధికారికంగా ఫలితాలు వెల్లడి అవుతాయి.
తెలుగుదేశం కేడర్ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. గత పదేళ్లుగా తెలంగాణలో పార్టీ దాదాపు నామమాత్రపు కార్యక్రమాలకే పరిమితమైనా, పార్టీ తరఫున పదవులు, హోదాలు అనుభవించిన నేతలు గోడ దూకేసి పక్క పార్టీలకు వలస వెళ్లిపోయానా.. క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.