అన్నదాతల ఆత్మహత్యలు.. ఆపేవారెవరూ?

Publish Date:Sep 10, 2015

Advertisement

 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. వర్షాలు రాక.. పంటలకు సరైన నీరు లేక.. పంటలు వేసిన సరిగా పండక పెట్టిన పెట్టుబడి కూడా రాక కడలోతు కష్టాల్లో కురుకుపోతున్న రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చావు ఒక్కటే మార్గమని తమ ప్రాణాలను బలిగొంటున్నారు. నిన్న మొన్నటి వరకూ జిల్లాలలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు రాజదాని నడిబొడ్డున రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

మరి ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వాలు మాత్రం తమ వైఖరిని మార్చుకుంటున్నాయా అంటే అదీలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రాజకీయ నాయకులు చేసిందని ఓ పదివంతు అయితే విద్యార్ధులు రైతులు చేసిన ఆందోళనలు.. వారి త్యాగాలు అనిర్వచనీయం. మరి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరువాత అయినా వారి పరిస్థితులు చక్కబడ్డాయా అంటే అదీ లేదు. ఎంతవరకూ పక్క రాష్ట్రంతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం.. వారితో వాదనలు.. వితండవాదాలు చేయడం ఇదే సరిపోయింది కాని రైతుల సమస్యలు ఏంటి వారి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని ఆలోచించే ధోరణి ఏ ఒక్క నాయకుడికి పట్టడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో హామీలు చేస్తారు కాని గెలిచిన తరువాత మాత్రం వారిని పట్టించుకునే నాదుడే లేడు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.. బంగారు తెలంగాణని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు కాని.. అసలు రాష్ట్రంలో ఉన్నరైతుల సమస్యలే పట్టించుకోని నాయకులు ఇక బంగారు తెలంగాణ ఎలా తయారు చేస్తారు అని గుసగుసలాడుకునే వారు కూడా ఉన్నారు. ఒక్క రాష్ట్రాన్నే అభివృద్ధి చేస్తే చాలదు.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని భావిస్తున్నారు. తన ఫామ్ హౌస్ లో పండే పంటలు కూరగాయలు మంచిగా పండితే చాలదు.. రాష్ట్రంలో ఉన్న రైతల పంటలు కూడా అదే విధంగా పండేలా చూడాలి. ఇకనైనా  తమ ఒంటెద్దు పోకడని మాని రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోసి రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

By
en-us Political News

  
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.