Publish Date:May 10, 2024
మా భూమి మీద నీ హక్కేంటి జగన్.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేశావు.. ఇప్పుడు మా భూముల మీద పడ్డావా అని పలువురు ఆంధ్ర్రప్రదేశ్ రైతులు నిలదీస్తున్నారు. కడుపు కాలి, కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకుపడుతున్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని జగన్ తమ భూముల మీద ఆధిపత్యం కోసం తీసుకొచ్చాడని, ఇప్పుడు ఆ యాక్ట్ కారణంగానే రైతులు జగన్ ప్రభుత్వాన్ని భూమిలో పాతిపెట్టబోతున్నారని అన్నారు. మా భూముల పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో చూసినప్పుడు గుండెలు మండిపోయాయని, మా తల్లిదండ్రులు ఇచ్చిన భూముల పుస్తకాల మీద జగన్ ఫొటో ఏంటని చాలా బాధపడ్డామని వారు చెప్పారు. అయితే, ఇంతకాలం జగన్ దురాగతాలకు భయపడి నోరు విప్పలేదని ఇప్పుడు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి, తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించడానికి సమయం వచ్చిందని వారు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-angry-on-land-title-act-25-175583.html
రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. పార్టీ అధికారంలోకి వస్తే వారు ఎమ్మెల్యేగా ఓడిపోతారు లేదా వారు ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుంది.
పేరుకే సన్యాసి... రాజకీయంగా అధికారంలోకి రావాలని తాపత్రయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాగా రాజకీయాల్లో రాణించాలని ఆశ..
ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం కూటమి 165 స్థానాలను సొంతం చేసుకుంది. 10 స్థానాలతో వైసీపీ సరిపెట్టుకుంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి కూర్చుని కాసేపు వయ్యారపు నవ్వులు నవ్వారు. కొద్ది క్షణాలు నానా రకాల మెలికలు తిరిగారు. ఆ తర్వాత మాట్లాడ్డం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 160 స్థానాలలో తెలుగుదేశం కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముందునుంచీ తెలుగువన్ చెబుతున్నట్లుగానే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఫలితాల సరళిని బట్టి స్పష్టమౌతోంది.
ఆరా మస్తాన్ కాదు.. మరేంటో చూడండి..
అతి తక్కువ వోట్ల మెజార్టీతో మడకశిర నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థి ఎం.ఎస్ రాజు గెలిచి సరికొత్త రికార్డును సృష్టించారు
పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఆయన సోదరుడు చిరంజీవిని ఆనందంలో ముంచెత్తింది. సోషల్ మీడియా ద్వారా చిరంజీవి తన స్పందనను తెలిపారు.
400 సీట్లు గెలిచి, మళ్ళీ అధికారంలోకి వస్తామని లోక్ సభ ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ చెబుతూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350 సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. మూడు లక్షల 15 వేల పైచిలుకు మెజారిటీతో సమీప ప్రత్యర్థి బిజెపి నుంచి పోటీ చేస్తున్న మాధవిలతపై గెలుపొందారు. గోషామహల్ నియోజకవర్గంలో మాధవిలత ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓవైసీని ఓడించే మెజార్టీ తెచ్చుకోలేకపోయారు.
వైసీపీకి కంచుకోటలో తెలుగుదేశం జెండా పాతింది. వైసీపీ విజయం కడపలో లాంఛనమే అనుకునే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో కమలం పార్టీ మాత్రం వెనుకబడింది. భారీగా నష్టపోయింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాను తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం కూటమి దక్కించుకుంది.