రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్దమే, కానీ..

Publish Date:Nov 6, 2014

Advertisement

 

 

రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం గుర్తించిన తూళ్ళూరు మండలంలో గల నేలపాడు, లింగాయపాలెం, దొండపాడు, శాఖమూరి, రాయపాడు, వెంకటపాలెం తదితర గ్రామాలలో రైతులు ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఈయబోమని తెగేసి చెప్పినట్లు ఒక ప్రభుత్వ వ్యతిరేఖ మీడియా పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. కానీ ఈరోజు తూళ్ళూరు గ్రామంలో మరొక ప్రముఖ తెలుగు ఛానల్ నిర్వహించిన పబ్లిక్ పాయింట్ కార్యక్రమంలో మాట్లాడిన రైతులందరూ ఆ వార్తలను ముక్తకంటంతో ఖండించారు. ఇంతవరకు ఏ మీడియాకు చెందిన ప్రతినిధులు తమ గ్రామానికి రాలేదని చివరికి తమ శాసనసభ్యుడు, మంత్రులయినా ఇంతవరకు గ్రామానికి రాలేదని, అటువంటప్పుడు తాము భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని వార్తలు వ్రాయడం ఏమిటని వారు ప్రశ్నించారు. అయితే ఒకసారి ఆర్డీఓలు, యం.ఆర్.ఓ. తదితర అధికారులు మాత్రం కొన్ని గ్రామాలలో పర్యటించి భూసేకరణ గురించి క్లుప్తంగా వివరించి, తమ డిమాండ్లను అడిగి తెలుసుకొన్నారని తెలిపారు. కానీ వారు తమకు ల్యాండ్ పూలింగ్-దాని విధివిధానాల గురించి కానీ, ప్రభుత్వం ఇవ్వబోయే ప్యాకేజి గురించి గానీ ఎటువంటి అవగాహన కల్పించలేదని,అందువల్లే రైతులలో భయాందోళనలు చెందుతున్నారని అన్నారు.

 

స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీలకు చెందినవారు వారి భయాందోళనలు మరింత పెరిగేలా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. చాలా గ్రామాలలో రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఈ వ్యతిరేఖ ప్రచారం వలన, అవగాహన లోపం వలననే భయాందోళనలకు గురయ్యి, పూర్తిగా నష్టపోతామేమోననే భయంతోనే తమ భూములను నష్టానికి అమ్మేసుకొంటున్నారని మరి కొందరు రైతులు విచారం వ్యక్తం చేసారు.

 

తమ భూముల గురించి మీడియా హైదరాబాదులో కూర్చొని వార్తలు ప్రచురించడాన్ని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడాన్ని రైతులు తప్పుపట్టారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని వారు కోరారు. లేదా ఈ 14గ్రామాల ప్రతినిధులను ఆయనతో హైదరాబాద్ లోనే సమావేశపరచాలని వారు డిమాండ్ చేసారు.

 

ఒకవేళ అది సాధ్యం కాకపోతే స్థానిక యం.యల్యే. మంత్రి స్వయంగా అన్ని గ్రామాలలో పర్యటించి రైతుల డిమాండ్లు తెలుసుకొని, ఈ ల్యాండ్ పూలింగ్ విధివిధానాల గురించి, ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న ప్యాకేజీ గురించి రైతులకు సరయిన అవగాహన కల్పించి వారికి భరోసా ఇచ్చినట్లయితే, రైతులు కూడా సంతోషంగా తమ భూములను ఇచ్చేందుకు అంగీకరిస్తారని చెప్పారు. ముందుగా అధికారులు, మంత్రులు క్షేత్ర పర్యటనకు వచ్చి రైతులతో నేరుగా మాట్లాడితే ఇటువంటి గందరగోళాన్ని నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక ఈరోజు మీడియాతో మాట్లాడిన తూళ్ళూరు మండల రైతులు తమ డిమాండ్లను, కొన్ని ఆసక్తికరమయిన విషయాలను మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసారు. అవేమిటంటే:

 

1. ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించేటప్పుడు పంటభూముల ప్రస్తుత మార్కెట్ రేట్లను, అందులో పండుతున్న పంటల వలన వస్తున్న రాబడిని, ప్రస్తుతం భూమి ఉన్న గ్రామం, ప్రదేశం, వాటికి గల లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ సౌకర్యాలు వంటివి అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని అందుకు తగినట్లుగా ప్యాకేజి ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

 

2. మంచి దిగుబడి, కౌలు రాబడి వచ్చే పంట భూములకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరుతున్నారు. అటువంటి పొలాలు, దిగుబడి ఉన్న రైతులకు అధిక ధరలు చెల్లించితే ఇతర రైతులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోమని అన్నారు.

 

3. బంగారం, భూములను బ్యాంకులలో తనఖా పెట్టుకొని ఏవిధంగా తాము బ్యాంకుల నుండి రుణాలు పొందగాలుగుతున్నామో అదేవిధంగా ప్రభుత్వానికి తాము ఇచ్చిన భూమికి ప్రతిగా ప్రభుత్వం తమకు ఇచ్చే భూమిపై రుణాలు పొందేందుకు వీలుగా దాని విలువను నిర్దారిస్తూ తమకు ప్రభుత్వం ‘హక్కు పత్రాలు’ తప్పనిసరిగా ఇవ్వాలని, వాటిని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు గౌరవించి రుణాలు మంజూరు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తద్వారా తమ భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తరువాత, పిల్లల పై చదువులకి, పెళ్ళిళ్ళులకు ఇతర అవసరాలకు ఎవరి ముందు చేతులు జాచే దుస్థితి కలగకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

 

4. ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకోవడానికి చూపుతున్న ఉత్సాహం, రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా చూపితే బాగుంటుందని వారు అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా తాము ఏ ప్రాంతంలో భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసామో, రాజధాని నిర్మించిన తరువాత తిరిగి అదే ప్రాంతంలో కనీసం ఎకరానికి 200గజాల కమర్షియల్ స్థలం కేటాయించాలని, సమీప ప్రాంతాలలోనే మరో వెయ్యి గజాలు కేటాయించాలని కోరారు.

 

5. అదేవిధంగా ప్రస్తుతం ఎకరానికి దాదాపు రూ.70,000 నుండి 1,00,000 వరకు ఆదాయం వస్తున్న పంట భూములకు ప్రభుత్వం కేవలం ఎకరానికి రూ.25, 000 మాత్రమే ఇస్తే తాము ఏవిధంగా కుటుంబాలను పోషించుకోగాలము? ఏవిధంగా పిల్లల పై చదువులు, పెళ్ళిళ్ళు చేసుకోగలము? తీవ్ర అనారోగ్యం ఏర్పడితే ఏవిధంగా ఖర్చులను తట్టుకోగాలము? అని వారు ప్రశ్నించారు. కనుక నష్టపరిహారం గురించి ప్రభుత్వం రైతులతో చర్చించిన తరువాతనే తన నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు.

 

6. కేవలం పెద్ద రైతులనే కాక, చిన్నకారు సన్నకారు రైతులను, వ్యవసాయ కూలీలను, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న గ్రామీణులను, చేతి వృత్తుల పనివారి శ్రేయస్సు గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరారు.

 

7. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిన్చినట్లయితే తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసారు. దేశ, విదేశాలలో పై చదువులు చదువుకొంటున్న, స్థిరపడిన తమ పిల్లలు కూడా రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమిని ఇమ్మనే తమను గట్టిగా కోరుతున్నారని, దాని వలన అందరికీ లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నట్లు రైతులు, గ్రామస్తులు తెలిపారు.

 

8. తూళ్ళూరు మండలంలో గల 14 గ్రామాలలో తొమ్మిది గ్రామాల రైతులు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి తమ భూములు అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని, మిగిలిన 5గ్రామాల ప్రజలలో నెలకొన్న ఈ సందేహాలను, భయాందోళలను తొలగించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసినట్లయితే మొత్తం 22, 600 ఎకరాల వరకు భూమి లభిస్తుందని వారు తెలిపారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.