Publish Date:Feb 18, 2026
హైదరాబాద్లో నకిలీ పోలీసుల ముఠా మరోసారి బీభత్సం సృష్టించింది. పోలీసు వాహనం, పోలీసు యూనిఫామ్, లాఠీలు, హ్యాండ్కఫ్స్తో సినీ ఫిక్కీ తరహాలో ఓ కంపెనీ ఎండి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నెలరోజుల పాటు సాగిన ఈ కిడ్నాప్ హైడ్రామాతో బాధిత కుటుంబం ప్రాణభయంతో వణుకుతూ దాదాపు నెలరోజుల పాటు బందీ జీవితం గడిపింది. చిట్టచివరకు పోలీసులను ఆశ్రయించింది.
కూకట్పల్లికి చెందిన రామచందర్రాజు శ్రీనివాస్ సివిల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండిగా ఉన్నారు. అదే సంస్థలో ప్రకాష్ అనే వ్యక్తి దాదాపు 26 ఏళ్లుగా ఫైనాన్స్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఆ సంస్థకు కాంట్రాక్ట్ పనులు చేసిన అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు, శివరామరాజులతో రామచందర్రాజుకు ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తాయి. అప్పట్లో పరస్పరం సెటిల్మెంట్ జరిగినప్పటికీ, మళ్లీ భారీ మొత్తాన్ని వసూలు చేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నాడు రూ.7 కోట్లు వసూలు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసిన నిందితులు, గతంలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతూ అరెస్టయిన నాగరాజు అలియాస్ కార్తీక్ను సంప్రదించారు. అతడు మరో ముగ్గురితో కలిసి నకిలీ పోలీస్ బృందాన్ని తయారు చేసి ఆపరేషన్కు తెరలేపాడు.
ప్లాన్ ప్రకారం ఈ ఏడాది జనవరి 9న ముందుగా ఫైనాన్స్ మేనేజర్ ప్రకాష్ను కిడ్నాప్ చేశారు. అనంతరం ఎండి రామచందర్రాజు కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ బందీగా ఉంచారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 వరకు దాదాపు నెలరోజుల పాటు బాధితులను ఏపీలోని ధవలేశ్వరం, హైదరాబాద్ సమీపంలోని మొయినా బాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్హౌస్లలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
ఇప్పటికే బాధితుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేసిన నిందితులు, ఇంకా రూ.4 కోట్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను హతమారుస్తా మని హెచ్చరించడంతో బాధితులు తీవ్ర భయాందో ళనలకు గురయ్యారు. చివరకు ప్రాణభయంతో కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో శివరామరాజుతో పాటు నకిలీ పోలీసులుగా వ్యవ హరించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన సూత్ర ధారులుగా భావిస్తున్న అల్లూరి వెంకట సత్యనా రాయణ రాజు, నాగరాజు అలియాస్ కార్తీక్తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-police-kidnapped-family-25-214274.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.