Publish Date:Jul 21, 2020
కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనా ట్రీట్మెంట్ కు అత్యవసరమైన మందులను కొంత మంది బ్లాక్ మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటుండగా, మరి కొంత మంది ప్లాస్మా దాతలుగా అవతారం ఎత్తి కరోనా బాధితులను, వారి బంధువులను పీల్చిన పిప్పి చేస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్మా డొనేషన్ పేరుతొ ఏకంగా 200 మందిని మోసం చేసిన ఒక యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీకాకుళం జిల్లా పోనుగూటివలసకు చెందిన రెడ్డి సందీప్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నం విఫలం కావడంతో దొంగతనాలు మొదలు పెట్టాడు. విశాఖపట్టణంలోని ఫ్లూ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన అతడు కరోనా కారణంగా రోగులకు ప్లాస్మా అవసరాన్ని గుర్తించాడు. దీనిని అవకాశంగా మార్చుకుని సందీప్ ప్లాస్మా డోనర్ పేరుతో మోసాలు చేయడమా మొదలు పెట్టాడు. ప్లాస్మా దాతల కోసం సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనలు చూసి వారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి తాను ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నానని, తన బ్లడ్ గ్రూప్ కూడా మీకు కావాల్సిన బ్లడ్ గ్రూపేనంటూ నమ్మించేవాడు. తాను శ్రీకాకుళం నుంచి వచ్చి వెళ్లేందుకు రవాణా, ఇతర ఖర్చుల కోసం కొంత డబ్బు కావాలని కోరేవాడు. దీంతో బాధితులు, వారి బంధువులు నమ్మి అతడి అకౌంట్ లో డబ్బులు వేసిన వెంటనే తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. సందీప్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 200 మందిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అతడి చేతిలో మోసపోయిన హైదరాబాద్కు చెందిన కొంత మంది బాధితులు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లలోను ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అయినా కొంతమంది ఇంతేనేమో.. ఒక పక్క ప్రజలు ప్రాణాల మీదకు వచ్చి అవస్థలు పడుతుంటే ఇటువంటి వారు దానిని కూడా సొమ్ము చేసుకునే నికృష్టమైన పనిలో ఉంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-plasma-donor-arrested-for-duping-over-200-people-in-hyderabad-39-101672.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.