ఎస్పీ బాలు మృతికి రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలు

Publish Date:Sep 26, 2020

Advertisement

సోషల్ మీడియా వేదికగా కొందరు సన్నాసులు రెచ్చిపోతున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. చీప్ పబ్లిసిటి కోసం, సొంత ప్రయోజనాల కోసం ప్రముఖులను బద్నాం చేస్తున్నారు. ఏపీలో కొన్ని వర్గాలే టార్గెట్ గా ఈ కుట్రలు చేస్తున్నారు. కావాలని బురద చల్లుతూ సిగ్గు లేని వెధవలు సంతోష పడుతున్నారు. అనారోగ్యంతో చనిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం మరణంపైనా పిచ్చోళ్లలా పిచ్చి రాతలు రాస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై బురద చల్లుతూ వికృత చేష్టలకు దిగారు బుద్ది, జ్ఞానం లేని చిల్లరగాళ్లు. ఎస్పీ బాలు చావుకు రామోజీరావుకు ముడిపెడుతూ చిల్లర రాతలకు దిగారు. రామోజీ రావు బలవంతం మీదే ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలసుబ్రమణ్యం హైదారాబాద్ వచ్చారని.. రామోజీ ఫిల్మ్ సిటీకి రావడంతోనే బాలుకి కరోనా సోకిందని  ప్రచారం చేస్తున్నారు. ఈటీవీ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది కళాకారులకు కరోనా సోకిందని.. బాలు తప్ప అందరూ కోలుకున్నారని ఫేస్ బుక్ పేజీల్లో, వెబ్ సైట్లలో ఇష్టమెచ్చినట్లుగా రాసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్  సిటీకి వెళ్లడం వల్లే బాలు చావు తెచ్చుకొన్నాడని, ఈ పాపం రామోజీ రావుదే నంటూ పైశాచికత్వం ప్రదర్శించారు. 

 

అయితే సోషల్ మీడియాలో సన్నాసులు  ప్రచారం చేస్తున్నదంతా పచ్చి బూటకమని తేలిపోయింది. ఇటీవల కాలంలో రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఈటీవీ ప్రోగ్రామ్స్ ఏమి జరగలేదు. కరోనా సమయంలో ఈటీవికి సంబంధించి ఎలాంటి ఈవెంట్లు జరగలేదు. ఎస్పీ బాల సుబ్రమణ్యం పాల్గొన్నది ఈటీవీ ప్రోగ్రామ్ కానే కాదు. జూలై 18న హైదరాబాద్ వచ్చిన ఎస్పీ బాలు, చరణ్ లు మౌనరాగం మురళీ 100వ ఎల్పీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ఈటీవికి  ఎలాంటి సంబంధం లేదు. కాని ఈ విషయంపై కావాలనే కుట్రపూరితంగా రాతలు రాస్తున్నారు కొందరు వెధవలు. ఈటీవీ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు రామోజీరావు బలవంతం మీద.. బాల సుబ్రమణ్యం హైదరాబాద్ వచ్చారని  కొందరు సన్నాసులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. 

 

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఎస్పీ బాల సుబ్రమణ్యం మీద ఎంతో అప్యాయత చూపేవారు. పాడుతా తీయగా కార్యక్రమంటే రామోజీ రావుకు అత్యంత ఇష్టం. అందుకే ఎస్పీ బాలుతో నిర్వహించేవారు. బాలూనే ఈ విషయాన్ని చాలా వేదికలపై చెప్పారు. రామోజీరావు తనకెంతో ఇచ్చారని, తానే ఆయనేమి ఇవ్వలేదని చెప్పుకునేవారు. పాడుతా తీయగా కార్యక్రమంతో తన గౌరవం మరింత పెరిగిందని తెలిపేవారు బాలు. ఈ కార్యక్రమంతో తన పేరు కూడా ఎస్పీ బాలు కాకుండా పాడుతా తీయగా బాలుగా మారిందని చెబుతూ నవ్వుకునేవారు. అంతేకాదు ఓ ఈవెంట్ లో వేదికపైనే రామోజీ రావుకి సాష్టాంగ నమస్కారం చేశారు బాలసుబ్రమణ్యం. రామోజీ కూడా బాలును ఎంతో అప్యాయతతో ఆలింగనం చేసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఎప్పుడు మీడియా ముందుకు రాని రామోజీ రావు.. బాలు మరణంపై మాత్రం మీడియా ముందుకు వచ్చి తమ సంతాపం తెలిపారు. తన జీవిత కాలంలో రామోజీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మార్గదర్శి మీద అప్పటి వైఎస్సార్ సర్కార్ కుట్ర పూర్వక కేసు పెట్టినపుడు తమ ఖాతాదారులకు భరోసా కల్పించడానికి మెుదటి సారి రామోజీ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చిన్న కొడుకు చనిపోయినపుడు కూడా మీడియా ముందుకు రాలేదు రామోజీ రావు. దీన్ని బట్టే చెప్పవచ్చు రామోజీకి, ఎస్పీ బాలు మీద ఉన్న గౌరవం, వారి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ. 

 

రామోజీ, ఎస్పీ బాలు మధ్య మంచి అనురాగ బంధాలుండగా.. కొందరు దుర్మార్గలు చావులోనూ చిల్లర చేష్టలకు దిగడం తెలుగు ప్రజలను విస్మయపరుస్తోంది. అయితే రామోజీరావుపై అసత్య ప్రచారం వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని సమాచారం. ఏపీలో కొంత కాలంగా కమ్మ నేతలు, కమ్మ వ్యాపారులు, కమ్మ సామాజిక వర్గంలోని ప్రముఖుల టార్గెట్ అయ్యారు. ఆ వర్గం వారిపైనే కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయి. రోజూ ఏదో ఒక చోట ఆలయంపై దాడి జరుగుతూనే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల దృష్టిని ఈ అంశంపై నుంచి మరల్చడానికే ఇలాంటి కుట్రలకు తెరలేపారని తెలుస్తోంది. బ్రహ్మణ, కమ్మ వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్నదే  చిల్లర కుట్రదారుల పన్నాగమని సమాచారం. ఎస్పీ బాలు బ్రహ్మణుడు కావడంతో అతని చావుకు రామోజీ రావు కారణమనే చిల్లర రాతలకు దిగారు. తమ ప్రచారంతో బ్రహ్మణులంతా కమ్మ వర్గాన్ని టార్గెట్ చేయాలన్నది వారి ప్లాన్ లో భాగమని భావిస్తున్నారు.

 

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని రామోజీ రావుకు అంటగడుతూ చేస్తున్న ప్రచారంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రచారం కోసం ఇంతగా దిగజారడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులపై చిల్లర ప్రచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవచ్చనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.