ఇప్తెకార్ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నాడు. చిట్టీల వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించాడు. ఆడ పిల్లల పెళ్లి, అనారోగ్యం వంటి కారణాలతో తన వద్ద చీటీ పాడుకునేవారికి చిట్టీ డబ్బులు మొత్తం ఇచ్చేవాడు కాదు. కమిషన్ ఎక్కువగా తీసుకునేవాడు. అవసరం అని తెలియగానే ఇప్తెకార్ తన దైన స్టైల్ లో దోచేసుకునే వాడు
ఒక రోజు బాధితులు మౌలానా దగ్గరికి వచ్చారు.
చీటీ బాధితులు: సలాం వాలేకుం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం భాయ్ , కైరియత్ తష్రీప్ రఖ్ నా ( రండి కూర్చొండి)
చీటీ బాదితులు: మౌలానా సాబ్ ఇప్తెకార్ చిట్టీల వ్యాపారంలో కస్టమర్లను మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు అడిగితే ఏదో ఒకరకంగా మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నాడు. తన కు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నాడు. చిట్టీల వ్యాపారం ప్రారంభించే ముందు ప్రతీ ఒక్కరితో నమ్మికగా ఉండే వాడు. ఇపుడు పూర్తిగా మారిపోయాడు.
మౌలానా: డబ్బు, ఆరోగ్యం పరువు ప్రతిష్టగా తీసుకుంటే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ప్రపంచమే ఒక ముసాఫిర్ ఖానా. పుట్టుక, చావులు ఇక్కడ షరామామూలే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ తాత్కాలికం. అయినా మనిషి వీటి పట్ల ప్రేమను పెంచుకుంటున్నాడు. ఇవి ఎప్పుడైనా మన నుంచి దూరమవుతాయి. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం. ధర్మం అనేది ఎల్లవేలలా మన వెంటే ఉంటుంది. ధర్మాన్ని లాక్కోవడం ఎవరి తరం కాదు. అల్లా కోరుకునేది కూడా ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని ఆచరించడం వల్ల డిప్రెషన్ లో వచ్చిన వారు లేరు. డబ్బు, ఆరోగ్యం మీద మమకారం పెంచుకుంటే డిప్రెషన్ వస్తుంది. కాంపిటేషన్ వల్ల కూడా మనిషి డిప్రెషన్ లో వెళ్లిపోతున్నాడు. ఈ భౌతిక ప్రపంచం మీద ప్రేమ పెంచుకోవద్దు. లోభం కూడా మంచిది కాదు. కుక్క కూడ లోభి లక్షణాలతో నిండి ఉంటుంది. కుక్క తమ యజమానిని చూసి తోక ఊపుతుంది. కానీ తన జాతికి చెందిన మరో కుక్క తన యజమాని గేటు ముందు నుంచి వెళ్లగానే తన అసలు స్వరూపం చూపిస్తుంది, నేను తినే రొట్టె వేరే కుక్క తన్నుకుపోతుందని ఈర్శ్య, ద్వేషంతో రగిలి పోతుంది. అరుస్తుంది. మరో కుక్క కండలను తన కోరపళ్లతో కొరికి రక్త సిక్తం చేస్తుంది. దీనిని బట్టి కుక్క విశ్వాసం గల జంతువు అనేది అపప్రద. ఈ విషయం కుక్కను పెంచుకునే యజమానికి కూడా తెలియదు. అది విశ్వాసం గల జంతువు అనుకుంటూ బతికేస్తున్నాడు. ఇప్తెకార్ కూడా విశ్వాసం గల వ్యక్తి కాదు అని అతని చేతల్లో తెలిసిపోయింది.జాగ్రత్తగా ఉండండి అంటూ మౌలానా హితవు పలికాడు.
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/excessive-love-of-money-is-not-good-39-187745.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.