Publish Date:Jul 12, 2022
ఎవరయినా ధనికులు తమ అనంతరం ఆస్తిని అనుభవించడానికి వారసులకు రాసేస్తారు. ఇది సాధార ణంగా మనం చూస్తున్నది, వింటున్నది. ఇటలీలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఉక్రెయిన్లో యుద్ధం ఆరంభమైనప్పటినుంచీ లక్షమంది శరణార్ధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇటలీ ప్రభుత్వం మీద పడింది. మున్ముందు మరింతమంది రావచ్చునని అంటున్నారు. అయితే వీరందరికి నివాసాలు, తిండి, నీరు సమకూర్చడానికి ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ఇటలీలో మాజీ మాఫీయా లకు చెందిన 40వేలకుపైగా నివాసాలను ప్రభుత్వం లాగేసుకుని శరణార్ధ కేంద్రాలుగా మార్చింది. మాఫియా డాన్ల వల్ల దేశానికి ప్రయోజనం లేకపోగా భారీ నష్టమే వుంటుంది. ఈ కారణంగా వారి ఆస్తులు, నివాసాలను అక్కడి ప్రభుత్వం తెలివిగా శరణార్ధులను ఆదుకోవడానికి ఉపయోగించడానికి తల పెట్టింది. ఇటీవలి కాలంలో ఇంతటి గొప్ప నిర్ణయం ఏ దేశ ప్రభుత్వమూ తీసుకున్న దాఖలాలు లేవు.
తెతియానా ఉక్రెయిన్ బుచా నుంచి యుద్ధ భయంతో పారిపోయింది. ఉక్రెయిన్లో యుద్ధం ఆరంభమైన వెంటనే ఆమే ఉత్తర మిలాన్ రెస్కాల్డినాలో శరణార్ధిగా తలదాచుకుంది. వచ్చిన కొత్తల్లో అక్కడా ఇక్కడా తలదాచుకుని, భయం భయంగానే వుంది. క్రమేపీ ఇటలీ ప్రభుత్వం రాన్ఘెటా అనే కలాబ్రియాన్ మాఫియా నివాసాన్ని ఆక్రమించి దాన్ని శరణార్ధ శిబిరంగా మార్చింది. దీంతో ఆమె ఇపుడు ప్రశాంతంగా ఆ నివాసంలో వుంటోంది. ఆమెను అక్కడి ప్రాంతీయ మేయర్ గిల్లెస్ ఆండ్రె లెలో ఎంతో గౌరవంగా ఆహ్వా నించి అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఆమె కుటుంబం ఇపుడు ఆమెతోనే వున్నది, నిర్భయంగా.
ప్రభుత్వం 2020లో మాజీ మాఫీయాలకు సంబంధించిన 1.5 బిలియన్ డాలర్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. సొర్బోలో మెజానీలో 144 పెద్ద పెద్ద నివాసాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని శరణార్ధులకు నీడ నిస్తోంది. ఇటువంటి గొప్ప నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో కూడా పాటించితే ఎంత బావుంటుందో కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/exmafia-properties-given-to-ukraine-refugee-25-139525.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.