టెన్షన్.. టెన్షన్..

Publish Date:Nov 29, 2023

Advertisement

తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గురువారం (నవంబర్ 30) జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) సర్వం సిద్దం చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అలాగే వృద్దులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టింది.   

గురువారం ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ కోసం.. 375 ఆర్మ్‌డ్ సెంట్రల ఫోర్స్ కంపెనీ సిబ్బందితోపాటు 50 వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించనున్నారు. తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను నవంబర్ 28వ తేదీ సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంచుతున్నారు. అదే విధంగా ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాలు... గజ్వేలు, కామారెడ్డి నుంచి బరిలో దిగగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కోడంగల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలో నిలిచారు. మొత్తంగా గులాబీ బాస్ కేసీఆర్‌ను ఓడించేందుకు అటు హస్తం పార్టీ అధ్యక్షుడు, ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల కంకణం కట్టుకున్నారనే  ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఉపందుకొంది. 

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. గత ఎన్నికల్లో అంబర్ పేట నుంచి బరిలో దిగిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది.. మోదీ కేబినెట్‌లో మంత్రిగా చోటు సంపాదించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి.. ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడంతో..  అసంతృప్తి వ్యక్తం చేసిన రాములమ్మ..   కాషాయం పెద్దల నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీకి రాం రాం చెప్పి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. ఇక కరీంనగర్ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. అదే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.    

అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. ఆయన సైతం ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.  

ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. ఆ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి ఆయన గెలుపొందారు. మళ్లీ ఆయన అదే స్థానంతోపాటు కేసీఆర్ బరిలో దిగిన గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.  అలాగే ఐపీఎస్ అధికారి.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని ఎవరు కైవసం చేసుకొంటారనే ఓ విధమైన టెన్షన్.. ఆ యా పార్టీల అధినేతల్లోనే కాదు.. ఇటు ప్రజల్లో సైతం టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు, రెబల్స్ బెడద అన్ని రాజకీయ పార్టీలను  ఇబ్బంది పెడుతోంది. వీరితో ఓట్లు భారీగా చీలి.. ఓటమి పాలవుతామనే ఓ విధమైన బెంగ.. వివిధ రాజకీయ పార్టీల నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

మరోవైపు... తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీకే ప్రజలు పట్టం కడతారా? లేకుంటే... కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేతులెత్తి జై కొడతారా? అదీ ఇది కాదు.. కాషాయం పార్టీని ఆదరిస్తారా? అంటే.. అందుకు జవాబు మాత్రం డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా ప్రజా నాడి బహిర్గతం కానుంది.

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.