హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఎన్ని కుట్రలు చేసినా తనను ఓడించలేకపోయారని చెప్పారు. ప్రజలంతా ఏకోన్ముఖంగా కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు ఈటల. ప్రపంచ చరిత్రలో ఈ ఫలితం గొప్ప అధ్యాయమన్నారు. వందల కోట్ల రూపాయలు, మద్యం, పథకాలు పెట్టినా, ప్రతి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం బావుటాను ఎగురవేసి విధంగా ధర్మం వైపు.. హుజరాబాద్ ప్రజలు నిలబడ్డారన్నాపు ఈటల రాజేందర్. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా.. వాళ్ల రుణం తీర్చుకోలేనేంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తనపై కుట్రలు చేసి కేసీఆర్ బయటికి పంపిస్తే బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు ఈటల రాజేందర్. తనకు అన్ని రకాలుగా అండగా ఉంటానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తనకు బాసటగా నిలిచారని చెప్పారు. 2018లో తనకు లక్షల 4 వేల ఓట్లు వస్తే ఇప్పుడు లక్ష 7 వేల ఓట్లు వచ్చాయన్నారు. తన జెండాతో, తన బొమ్మతో నేను గెలిచానని అహంకారంగా మాట్లాడారో.. దానికి విరుద్ధంగా ప్రజలు పిలుపునిచ్చారని రాజేందర్ వెల్లడించారు. కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయమన్నారు. 10 లక్షలు ఇచ్చినా అమ్ముడుపోబోమని దళిత బిడ్డలు ఎంతో గొప్పగా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని చెప్పారు.
స్మశాన వాటికలకు పిలిపించుకొని మరీ డబ్బులు పంచారని ఆరోపించారు ఈటల రాజేందర్. ముందుగా 6000, తర్వాత నాలుగు వేల చొప్పున పంచారన్నారు. పోలీసుల అండతో ఎస్కార్ట్ వాహనంలో డబ్బులు తెచ్చి పంచారని చెప్పారు.చివరికి తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి దేవుడు ముందు ప్రమాణం చేయించుకున్నారని తెలిపారు. పెన్షన్ పోతుందని వృద్ధులను బెదిరించారని ఆరోపించారు. దళిత బంధు కూడా ఆపేస్తామని భయపెట్టారని తెలిపారు.
కుట్రదారులు ఎప్పుడు కుట్రలతోనే నాశనం అవుతారన్నారు ఈటల రాజేందర్. తనపై పోటీకి రావాలని కేసీఆర్, హరీష్ రావు కు సవాల్ చేస్తే.. రాకపోగా పొలగాన్ని నిలబెట్టారన్నారు. రెండు గుంటల వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా ఖర్చు చేశాడని ఈటల ప్రశ్నించారు. కుట్రలతో దొంగ ఉత్తరాలతో తనను ఓడించాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగిందన్నారు. హుజురాబాద్ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు ఈటల రాజేందర్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/etela-rajender-hot-comments-on-cm-kcr-huzurabad-by-poll-25-125754.html
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.