ఈట‌ల దూకుడు వ్యూహం ఫ‌లిస్తుందా?!

Publish Date:Jan 22, 2025

Advertisement

తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌ల్లో బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఒక‌రు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన ఈట‌ల‌.. తెలంగాణ‌ బీజేపీలో కీల‌క నేత‌గానూ కొన‌సాగుతున్నారు. సౌమ్యుడు, మృదు స్వ‌భావిగా ఆయ‌న‌కు  పేరుంది. అయితే, ప్ర‌స్తుతం ఈటల‌ త‌న రాజ‌కీయ పంథాను మార్చారు. గేరుమార్చి దూకుడు రాజ‌కీయాల‌కు పెద్ద‌ పీట వేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ లో వ‌చ్చిన ఈ అనూహ్య‌ మార్పును చూసి బీజేపీ నేత‌ల‌తోపాటు ఇత‌ర పార్టీల్లోని నేత‌లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత‌కీ ఈట‌లలో అనూహ్య మార్పున‌కు కార‌ణం ఏమిట‌ని ఆరాతీస్తే.. పెద్ద ప్లానే ఉంద‌ని తెలుగస్తోంది. 

తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీ వేగంగా ఎదుగుతోంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ రోజురోజు బ‌ల‌ప‌డుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాక‌పోయినా.. ఆ త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  స‌త్తా చాటింది. ప‌దిహేడు పార్ల‌మెంట్ స్థానాలకు గాను ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆ పార్టీ కేంద్ర అధిష్టానం తెలంగాణకు నూత‌న అధ్య‌క్షుడ్ని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈట‌ల రాజేంద‌ర్ గేరుమార్చి త‌న‌లోని స‌రికొత్త రాజ‌కీయ కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

ఈట‌ల రాజేంద‌ర్ రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ఎక్కువ కాలం ఆయ‌న రాజ‌కీయ జీవితం బీఆర్ఎస్ పార్టీలోనే కొన‌సాగింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన ఈటల‌.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డంలోనూ త‌న‌వంతు పాత్ర పోషించారు. ఆ త‌రువాత కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగానూ కొన‌సాగారు. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ త‌రువాత ఈట‌లనే అనే స్థాయికి ఆయ‌న చేరుకున్నారు. 2021లో పార్టీ అధినాయ‌క‌త్వంతో ఏర్ప‌డిన విబేధాల కార‌ణంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలోనూ ఈటల రాజేంద‌ర్ కీల‌క నేత‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఈట‌ల విజ‌యం సాధించారు.

 బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈట‌లకు ఆ సామాజిక వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉంది. బీసీల‌లోనే కాకుండా జ‌నాభా ప‌రంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్‌కు.. రెడ్డి సామాజిక వ‌ర్గంతోకూడా సంబంధాలున్నాయి. ఎందుకంటే.. ఆయ‌న స‌తీమ‌ణి రెడ్డి సామాజిక వ‌ర్గంకు చెందిన‌వారు. ఈ క్ర‌మంలో బీజేపీ తెలంగాణ‌ అధ్య‌క్ష బాధ్య‌త‌లను ఈటల‌కు అప్ప‌గిస్తార‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఆయ‌న దూకుడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌ని, అలా అయితే, పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం సాధ్యం కాద‌న్న భావ‌న‌లో కేంద్ర పార్టీ పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈటల ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లో త‌న గేరు మార్చిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. 

పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాలంటే దూకుడుగా ఉండాలనీ,  కార్య‌క‌ర్త‌ల‌కు, ప్రజలకు అండ‌గా ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వంపైకి దూకుడుగా వెళ్లాలి. గ‌తంలో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు  బండి సంజ‌య్ తన దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ పేరు మారుమోగిపోయేలా చేశారు.  ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించ‌డంలో అప్పట్లో బండి సంజ‌య్ చాలా దూకుడుగా వ్యవహరించారు. ప‌రుష ప‌ద‌జాలంతో ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తూ వెళ్లారు. ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సైతం గ‌తంలో దూకుడుగా రాజ‌కీయాలు చేసి స‌క్సెస్ అయ్యారు. ఏపీలో నారా లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ అదే తీరుతో  ప్ర‌జానాయ‌కులుగా ఎదిగారు. తెలంగాణ అధ్య‌క్షుడిగా అలాంటి వ్య‌క్తినే ఎంపిక చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ు‌. ఈ క్ర‌మంలోనే ఈట‌ల త‌న రాజ‌కీయ పంథాను మార్చుకున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

రెండురోజుల క్రితం పేద ప్రజలు కొనుక్కున్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ రియల్‌ వ్యాపారి అనుచరుడిపై ఈట‌ల చేయి చేసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో ఈట‌ల పేరు మారుమోగిపోతుంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న ఆయ‌న‌.. ఉన్న‌ట్లుండి త‌న రాజ‌కీయ పంథాను మార్చ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిలో మార్పు రావ‌డానికి బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వే కార‌ణ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మ‌రి.. ఈట‌ల వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే   కొద్ది రోజులు ఆగాల్సిందే.

By
en-us Political News

  
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.