అంచనాలు పెంచుకున్న బాబు.. ఇక కత్తిమీద సాము!

Publish Date:Sep 10, 2024

Advertisement

చంద్రబాబు పాలనా దక్షత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన రాష్ట్ర రూపురేకలనే మార్చేశారు. జంటనగరాలకు అదనంగా మరో మహానగరాన్ని నిర్మించి, ఐటీ హబ్ గా మార్చారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు తప్ప మరేమీ మిగలని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగేళ్ల పాటు దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారు. ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పరిశ్రమలు తరలి వచ్చాయి. ఐటీలో హైదరాబాద్, బెంగళూరులకు దీటుగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.

కారణాలేమైతేనేం.. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కారు. అక్కడ నుంచి రాష్ట్రం అన్ని రంగాలలో పతనం కావడం మొదలైంది. పరిశ్రమలు తరలిపోయాయి. పెట్టుబడులు వెనక్కుపోయాయి. అభివృద్ధి పడకేసింది. రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు జగన్ కక్ష సాధింపు రాజకీయాలతో జనం విసిగి వేసారిపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే జైళ్లు నోర్లు తెరిచే పరిస్థితి ఏర్పడింది. ప్రజల బాధలు కష్టాలు పట్టని జగన్ సర్కార్ వారిని వేధింపులకు గురి చేయడంలో మాత్రం అన్ని రికార్డులను అధిగమించేసింది.  జగన్ పాలనలో  బాధలకు గురి కాని వర్గం లేదు. అన్ని వర్గాల ప్రజలూ జగన్ సర్కార్ అరాచక పాలనకు బాధితులుగా మారారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలనను, ఆ తరువాత ఐదేళ్లు జగన్ పాలననూ చూసిన జనం 2024 ఎన్నికలకు చాలా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారి నిర్ణయం ఏమిటన్నది ఫలితాలు విస్పష్టంగా తేల్చేశాయి. 

అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమ లు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొన్న జనం జగన్ పాలనకు చరమగీతం పాడారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రతిసారీ తన పని తీరుతో, తన పాలనతో తనపై ప్రజలలో అంచనాలను విపరీతంగా పెంచేశారు.  

ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టి పూర్తిగా మూడు నెలలు కాలేదు.  అప్పుడే జనం గత ఐదేళ్ల జగన్ అధ్వాన పాలన తాలూకు బాధలను మరిచిపోయి.. బంగారు భవిష్యత్ కోసం ఆశగా చంద్రబాబువైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అన్ని రంగాలలోనూ అవ్యవస్థ, అస్తవ్యస్థ పరిస్థితులను చక్కదిద్దిగాడిలో పెడుతున్నారు. ఆ సమయంలో అనూహ్యంగా భారీ వరదలు వచ్చాయి. బెజవాడ నగరం సగం మునిగిపోయింది. ఆ విపత్కర పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంది. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. సాధారణంగా ఒక విపత్తు సంభవించినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని విమర్శలను ఎదుర్కోకతప్పదు. ముంపు బాధితుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. కానీ చంద్రబాబు సర్కార్ పై బాధితుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు చంద్రబాబు బాధితులకు కల్పించిన భరోసా, ఆపత్స మయంలో అండగా ఉండి ఇచ్చిన ధైర్యమే కారణమనడంలో సందేహం లేదు. ముంపు ప్రాంతాల్లో మోకాలు లోతు నీటిలో ప్రయాణించి మరీ ఆయన బాధితులను చేరుకున్నారు. తానున్నానన్న భరోసా ఇచ్చారు. 

చంద్రబాబు వరద బాధితుల సహాయ పునరావాస చర్యలతో సరిపెట్టలేదు. వరద తగ్గిన తరువాత కూడా వారికి అండగా దండగా నిలవాలనుకున్నారు. నిలిచారు. ముంపునకు గురైన గృహాలను ఫైరింజన్ల ద్వారా శుభ్రం చేయించారు. ముంపు ప్రాంతాలలో పాడైపోయిన వాహనాలు, టీవీలు, ఫ్రిజ్లు వంటి వాటి మరమ్మతులకు ఆయా కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి అవసరమైన సాయం సత్వరమే అందేలా చేశారు.  చేస్తున్నారు. ముంపు గృహాలలో పాడైపోయిన ఆయా కంపెనీల ఉత్పత్తులకు ఉచితంగా మరమ్మతులు చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయంటే అందుకు చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఒక్క పిలుపుతో తొలుత ఎల్జీ కంపెనీ, ఆ తరువాత ఇతర కంపెనీలు ఉచిత మరమ్మతులకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు చొరవే. ఆ మేరకు అది ముంపు బాధితులకు అనూహ్యమైన ఊరటే. వెసులుబాటే. ఇక పలువురు కార్లు, బైక్ మెకానిక్ లు ముంపు ప్రాంతాలలో పాడైపోయిన వాహనాలకు ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో మరమ్మతులు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాను పని చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం చేత  పని చేయిం చడమే కాదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా వారిలో స్ఫూర్తి నింపింది చంద్రబాబు నాయకత్వం. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారపొట్టాలు అందించడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోయినట్లు కాదని చంద్రబాబు తన చేతలతో నిరూపించారు. ఇప్పుడు జనాలకు ఆయనపై అంచనాలు ఆకాశం ఎత్తుకు పెరిగిపోయాయి.

రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, వ్యవస్థలలో పేరుకుపోయిన అవ్యవస్థ ఇవేమీ జనాలకు పట్టదు. వారి అంచనాలను అందుకునేలా ప్రభుత్వం పని చేయాలి. అందుకే ఇక ప్రజల అంచనాల మేరకు పని చేయడం బాబు సర్కార్ కు ఒక సవాలే.  జగన్ పాలనతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉందికదా అని చెప్పి జనాలను ఒప్పించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజల దృష్టిలో  చంద్రబాబు కేవలం రాజకీయనాయకుడు కాదు.. సూపర్ లీడర్. ప్రజా సమస్యలను చిటికెలో పరిష్కరించగలిగిన హీ మ్యాన్. జనం అంచనాలను అందుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న బిగ్ టాస్క్.! 

By
en-us Political News

  
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.