నాలుగో టి20లోనూ టీమ్ ఇండియా ఘోర పరాజయం.. సిరీస్ ఇంగ్లాండ్ కైవసం.!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టి20ల సిరీస్ లో టీమ్ ఇండియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా,  తరువాత మూడు మ్యాచ్ లలోనూ టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది.  బ్రిస్టల్‌ వేదికగా గురువారం (జులై 9) జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో   ఇంగ్లాండ్ జట్టు భారత్‌పై సునాయాస విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇఖ నాలుగో టి20 విషయానికి వస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ టీమ్ ఇండియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి   9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సిరీస్ లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.   బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నా  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్  బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్   49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి మిగిలిన బ్యాటర్ల నుంచి ఎటువంటి సహకారం లభించకపోవడంతో టీమ్ ఇండియా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  158 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్  20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, జోష్ టంగ్ కూడా 2 వికెట్లు తీశాడు. 

ఇక 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌  13.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదేశింది.  కెప్టెన్ హ్యారీ బ్రూక్  35 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి తోడుగా ఫిల్ సాల్ట్  42 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు  151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశారు.  

Shreyas Iyer lone battle, India vs England T20, Team India loses series, Harry Brook

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరలేచింది.
Corona scare in Kadapa, Andhra Pradesh Covid Cases, Kadapa Covid Deaths, New Corona Variant AP, Omicron Subvariant Symptoms
గురుగ్రామ్ ఐవీఎఫ్ డీఎన్ఏ వివాదం నేపథ్యంలో దేశంలోని ఐవీఎఫ్ క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంకులపై జాతీయ మహిళా కమిషన్ NCW కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఐవీఎఫ్ IVF , ఏఆర్టీ ART క్లినిక్‌లలో జరుగుతున్న అక్రమాలు, ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు జాతీయ మహిళా కమిషన్ NCW రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మహిళల పునరుత్పత్తి హక్కులు మరియు భద్రతను కాపాడటమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తైతే, ఇన్వెస్ట్ చేశాక క్రమశిక్షణ పాటించడం మరో ఎత్తు. ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకుల్లో చేసే 3 సాధారణ తప్పులు, వాటి వల్ల జరిగే భారీ నష్టాలు మరియు నిపుణుల కీలక సూచనలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఎన్‌ఎస్ఈ ఎమర్జ్‌లో ఐసీ ఎలక్ట్రికల్స్ ఐపీఓ 67.7 శాతం భారీ ప్రీమియంతో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ సాధించింది. 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకిన ఈ రైల్వే షేరు ఆర్థిక వృద్ధి వివరాలు ఇక్కడ చూడండి.
అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ బిగ్ డీమెర్జర్ తర్వాత సరికొత్త జూన్ త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. వేదాంత పవర్ సేల్స్ ఏకంగా 245 శాతం పెరగగా, ఐరన్ అండ్ స్టీల్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకింది. వేదాంత అనుబంధ కంపెనీల లేటెస్ట్ స్టాక్ మార్కెట్ ప్రదర్శన, షేర్ల ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బెంగళూరు కోరమంగళలోని ప్రసన్న గణపతి ఆలయానికి టెక్కీ గణేశా గా ఎందుకు పేరొచ్చింది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రమోషన్ల కోసం ఈ గుడికి క్యూ కడుతున్న ఐటీ భక్తుల పూర్తి వివరాలు మీకోసం.
గోల్డియామ్ ఇంటర్నేషనల్ షేరు ధర ఒకే రోజు 24 శాతం పడిపోవడానికి కారణం క్రాష్ కాదు, 1:3 బోనస్ షేర్ల సర్దుబాటు. ఈ బోనస్ లెక్కలు మరియు ఇన్వెస్టర్ల లాభాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూరోపియన్ యూనియన్ కొత్తగా కార్లలో డ్రైవర్ ముఖంపై నిఘా పెట్టే కెమెరా సిస్టమ్‌ ADDW ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రైవసీ ఆందోళనలను ఎలా పెంచుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
2026 పాపులర్ గేమ్ జీరో పరేడ్స్ ఫర్ డెడ్ స్పైస్ నుండి సరికొత్త మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా, అసలు గేమ్ లేకపోయినా ఆడుకునేలా ఉచిత టేబుల్‌టాప్ వెర్షన్‌ను డెవలపర్లు విడుదల చేశారు. పూర్తి వివరాలు మరియు స్టీమ్ డిస్కౌంట్ ఆఫర్లు ఇక్కడ చూడండి.
చైనా అత్యున్నత సైన్స్ అవార్డు గెలుచుకున్న ఇద్దరు పల్లెటూరి శాస్త్రవేత్తలు చెన్ లిక్వాన్, బెన్ డే ల అద్భుత విజయ గాథ. ఈవీ బ్యాటరీలు, ఫైటర్ జెట్ రాడార్ సాంకేతికతలో వారు సృష్టించిన విప్లవం గురించి ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.