అమ్మకానికి ఇంజనీరింగ్ కాలేజీలు
Publish Date:Oct 15, 2012
Advertisement
మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. కాలేజీలకు అనుమతికావాలన్నా, రద్దుకావాలన్నా ఎఐసిటి ని సంప్రదించవలసిందే. ప్రస్తుతానికి 10 కాలేజీలు ఈసంస్ధను అనుమతి రద్దు చేయాలంటూ కోరాయి. త్వరలో ఇది 50 కాలేజీలకు పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కాలేజీల పరిస్ధితి అలాగే వుందని, సిక్స్ పే అమలు చేస్తామన్న కాలేజీలు, ఫిఫ్త్ పే అమలు చేస్తున్న కాలేజీలు, 35 వేలకు ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న కాలేజీలుకూడా ఆర్ధికంగా నష్టాలలో నడుస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం తమను టాస్క్ ఫోర్స్ ల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆరోపణలు మరొక విధంగా ఉన్నాయి. కేవలం వ్యాపార పంధాలో కాలేజీలు నిర్వహించడం వల్ల ఇలా జరుగుతుందని, అరకొర సౌకర్యాలతో, నైపుణ్యంలేని అధ్యాపకులతో కేవలం సర్టిఫికేట్లు జారీ చేసే కార్యాలయాలుగా ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు పనిచేస్తున్నాయని వారు అంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో యాజమాన్యాలు ఇంతగా నష్టపోటానికి కారణం ప్రభుత్వ మేనని జూన్ మొదటివారంలో నిర్వహించవలసిన అఢ్మిషన్లను సెప్టెంబర్ లో జర పటం వల్ల దాదాపు 50,000 మంది విద్యార్దులు మిగతా రాష్ట్రాలకు తరలిపోయారని కళాశాల యాజమాన్యులు చెబుతున్నాయి. అంతేకాక విద్యాసంవత్సరంలో జరిగిన జాప్యానికి కానూ విదేశీ విద్యార్ధులు కూడా వేరే రాష్ట్రాలకు తరలి పోయారని వారు తెలిపారు. అయిన అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ ఫీజుకు మంచి విద్యను అందిస్తున్నామన్నారు. బెంగాల్లో 9 కోట్లమంది జనాభావుండగ 14 వేలమంది మాత్రమే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారని, మనరాష్ట్ర జనాభా 8 కోట్లమంది ఉండగా ఆలస్యంగా మొదలైన ఈ విద్యాసంవత్సరంలో కూడా 1,75,000 మంది ఇంజనీరింగ్ లో చేరారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే యంబిఎ, యంసిఎ కాలేజీలు కూడా ఇదే బాటలో ఉన్నాయని వారు చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలు మార్కెట్లో పెట్టి వేల మందికి ఉపాధి కల్పించామన్న యాజమాన్యాలు ఈ పరిస్దితికి కారణం ప్రభుత్వమేనంటున్నారు. ఏది ఏమైనా కారు చౌకకు కాలేజీలు అమ్మబడును అనేది మాత్రం నిజం.
http://www.teluguone.com/news/content/engineering-colleges-for-sale-24-18165.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





