ఆదాయం కావాలి కాని....
Publish Date:Oct 4, 2012
Advertisement
మంత్రిగారింట్లో పెరటిగోడ గేటు పిల్లల ఆటల్లో ఊడిపోయిందంటే ఆ వార్త ముద్రణ అయ్యేలోపే ఆ గేటు, ఆ గోటున్న గోడను కూడా వెంటనే బాగుచేసేస్తారు. కాని... కోట్లల్లో... లక్షల్లో... ఆదాయాలను దండుకుంటూ... ఎక్కువ ఆదాయం వస్తూ దేవాదాయశాఖలో కలవని దేవాలయాలను కలుపుకుంటూ.. కనీసం రక్షణచర్యలు కూడా తీసుకోకుండా ఆర్జనపైనే అంతా దృష్టిపెట్టే దేవాదాయశాఖకు నిర్లక్ష్యానికి భక్తుల నమ్మికకు విఘాతం కలిగించేలా శ్రీశైల మహాక్షేత్రం మహా ప్రాకార కుడ్యం ఉత్తరం వైపు వున్న శివాజీ గోపురం కుప్పకూలి కలశాలు సైతం మట్టిలో కూరుకుపోయాయి. రెండు సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తిలోని ఆలయ రాజగోపురం కుప్పకూలిపోయింది. దాని నిర్మాణానికి ఎంతోమంది దాతలు ముందుకువచ్చినా... దేవాదాయశాఖ, పురావస్తుశాఖల వ్యవహరశైలి వల్ల ఇంకా నిర్మాణానికి నోచుకోనేలేదు. ఇప్పుడు ఈ శ్రీశైలం ఆలయం శివాజీ గోపురం. రాష్ట్రంలోని పలు దేవాలయాల నుండి ప్రతి ఏడాది వచ్చే సొమ్మును దేవాదాయశాఖకు తరలించుకుని దాన్ని వివిధ రకాలుగా ఖర్చుచేసే ప్రభుత్వ అధికారులు ఆలయాలను, అందలి ఉద్యోగులను, అర్చకులను మాత్రం పట్టించుకోరు. చివరకు తమ రాజకీయాలను సైతం దేవాలయాలకు సైతం విస్తరించారు. మిగిలిన మతాలకు వాటికి సంబంధించి ప్రత్యేక శాఖ ప్రభుత్వ ఆధీనంలో లేనప్పుడు.. మరి హిందు దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శాఖ ఎందుకు? దాని వల్ల దేవాలయాలకు ఫలితం ఏముంది? రాజకీయ నాయకుల పునరావాస పదవులకు, ప్రభుత్వానికి ఆదాయం కోసం తప్ప. ప్రభుత్వం నుండి దేవాదాయశాఖను విడదీసి.. దాన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పాటుచేసి ఆయా ఆలయాలకు చెందిన పూర్వీకులను (ఉన్నవారిలో) కొందరిని ఆయా ప్రాంతాలకు ఎన్నుకుంటే ...అది స్వతంత్రంగా... ఆయా ఆలయాల పర్యవేక్షణ, భద్రత, భక్తుల సేవలు తదితరాలు వారే చూసుకుంటారు. .. ఇందులో మాత్రం రాజకీయ నాయకులకు చోటు వుండకూడదు! ఆదాయానికి తీసుకనేందుకు ముందుంటారు కాని....మరమ్మతులకు వస్తే మాత్రం వారికి వినపడదు, కనపడదు. నే ఎక్కేబండి జీవితకాలం లేటు అన్నట్లుగా కాకుండా ఇప్పటికైనా నేతలు, అధికారులు మేల్కొని.. రాష్ట్రంలో శిథిలావస్థలో వున్న ఆదాయంతో పనిలేకుండా అన్నిటికి మరమ్మతులు చేయించాలని.. లేదంటే.. ఇది కోట్లాదిమంది భక్తుల నమ్మికను మోసంచేసినట్లవుతుందని... భక్తులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/endowment-department-24-17909.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





