శాంతి పట్టుచీర క‌థ‌.. వెలుగులోకి అక్ర‌మాల పుట్ట!

Publish Date:Jul 20, 2024

Advertisement

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి, దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్య‌వ‌హారం. వీరి వ్య‌వ‌హారంలో లోతుగా వెళ్లిన కొద్దీ దిగ్భ్రాంతికర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. త‌న భార్య‌ శాంతి జ‌న్మ‌నిచ్చిన కుమారుడికి తండ్రి ఎవ‌ర‌నే విష‌యం తేల్చాల‌ని భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ ఓ వైపు కోరుతుంటే..  మ‌రోవైపు దేవాదాయ శాఖ  అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో శాంతి అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.  

ఆమె ఆస్తుల చిట్టా కూడా చాలా చాలా పెద్ద‌గానే ఉంది. హైద‌రాబాద్, మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లిలో కోట్లాది రూపాయ‌ల విలువైన‌ విల్లాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. విశాఖ ప‌ట్ట‌ణంలో ప‌దెక‌రాల మామిడి తోట కూడా ఉందని అంటున్నారు‌. అంతేకాదు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో ఆమె ఏదైనా దేవాల‌యానికి వెళితే క‌చ్చితంగా ప‌ట్టు చీర‌తో పాటు రూ. 50వేలు స‌మ‌ర్పించాల్సిందేన‌న్న విమ‌ర్శ‌లూ వినిపిస్తున్నాయి. శాంతి పోస్టింగ్ విష‌యంలోనూ కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆమె ఏపీపీఎస్సీ పరీక్షలో పాస్ కాకుండానే   కొంత మంది మ‌ద్ద‌తుతో   జాబ్ లోకి వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

 దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య సంబంధంపై గ‌త వారంరోజులుగా విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంపై క్లారిటీ ఇవ్వాల్సిన విజ‌య‌సాయిరెడ్డి.. మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన మీడియాపై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. కానీ,  శాంతి, త‌న‌కు మ‌ధ్య సంబంధం ఏమిట‌నే విష‌యంపై ఎక్క‌డా క్లారిటీ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు శాంతి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి నేను జ‌న్మ‌నిచ్చిన మ‌గ‌బిడ్డ‌కు తండ్రి నా భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ కాదు.. అడ్వ‌కేట్‌ సుభాష్ రెడ్డి అని కుండబద్దలు కొట్టినట్లు చేప్పేశారు.  సుభాష్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు మీడియా ముందుకు రాక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు తనకూ ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై శాంతి  భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త వారం రోజులుగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. నా భార్య‌ శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు తండ్రి విజ‌య‌సాయిరెడ్డేన‌ని ఆరోపిస్తున్నారు. భ‌విష్య‌త్తులో త‌న‌కు, శాంతికి పుట్టిన ఇద్ద‌రు ఆడ పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌స్తుతం శాంతి జ‌న్మ‌నిచ్చిన మ‌గ బిడ్డ‌కు ఎదిగే కొద్దీ ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని.. ఇప్పుడే ఈ విష‌యంపై తేల్చాల‌ని మ‌ద‌న్ మోహ‌న్ డిమాండ్ చేస్తున్నారు. విజ‌య‌సాయి రెడ్డికి, సుభాష్ రెడ్డికి డీఎన్ఏ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని కోరుతున్నారు. ఇదే విష‌యంపై రాష్ట్ర హోమంత్రి అనిత‌ను క‌లిశారు. కోర్టుకు సైతం వెళ్లేందుకు మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. ఈ వ్య‌వ‌హారం సాగుతున్న స‌మ‌యంలోనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా త‌న హోదాను అడ్డుపెట్టుకొని శాంతి చేసిన అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి.

 శాంతి ఏపీపీఎస్సీ నుంచి డైరెక్ట్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ గా జాయిన్ అయ్యారు. అయితే, ఆమెకు అర్హ‌త లేక‌పోయినా విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టింగ్ ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇందులో రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని, ఆమె ద్వారా విశాఖ‌లోని దేవాదాయ శాఖ భూములను పెద్ద‌ మొత్తంలో కొట్టేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొంద‌రు వ్య‌క్తులు దేవాదాయ శాఖ ప‌రిధిలోని భూముల వివ‌రాల కోసం స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసినా వివ‌రాలు ఇచ్చేందుకు గ‌తంలో శాంతి తిర‌స్క‌రించార‌ని, వివ‌రాలు ఇవ్వాల‌ని ఉన్న‌తాధికారులు సూచ‌న‌లు చేసినా ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాడేప‌ల్లిలోని మాజీ సీఎం జ‌గ‌న్ నివాసానికి కొద్దిదూరంలో శాంతి ఓ విల్లా నిర్మాణం చేస్తున్నారు. ఆ విల్లా నిర్మాణానికి దాదాపు 40 నుంచి 50 మంది కూలీలు ప‌నిచేస్తున్నారు. వారంద‌రికి రోజూ భోజ‌నాలు విజ‌య‌వాడ సీతారామ‌య్య స‌త్రంతో పాటు మ‌రొక స‌త్రం నుంచి  స‌ప్ల‌య్ చేస్తున్నార‌ని స‌మాచారం. విల్లా వ‌ద్ద ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కొంద‌రు దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

శాంతి స‌హ‌కారంతో విజ‌య‌సాయిరెడ్డి, మ‌రి కొంద‌రు వైసీపీ నేత‌లు పెద్ద‌మొత్తంలో దేవాదాయ భూముల‌ను క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే శాంతికి ఓ విల్లాను విజ‌య‌సాయిరెడ్డి కొనిచ్చార‌నేది ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారంలో ఉంది. మొత్తానికి విజ‌య‌సాయిరెడ్డి, శాంతి వ్య‌వ‌హారం ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాంతికి జ‌న్మ‌నిచ్చిన బిడ్డ‌కు తండ్రి విజ‌య‌సాయిరెడ్డా.. సుభాష్ రెడ్డా అనే విష‌యం తేలాల్సి ఉండ‌గా.. మ‌రోవైపు దేవాదాయ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో శాంతి అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ఇప్ప‌టికే శాంతి అక్ర‌మాల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డి దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి పూర్తి వివ‌రాలు సేక‌రించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వానికి నివేదిక అందించే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి శాంతి జ‌న్మ‌నిచ్చిన బిడ్డ ఎవ‌రో తేల్చాల‌ని ఆమె భ‌ర్త డిమాండ్ చేస్తున్న క్ర‌మంలో.. శాంతి అక్ర‌మాలుసైతం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.