పెరుగుతున్న వసూల్ రాజాలు?
Publish Date:Jun 21, 2012
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో చెలగాటమాడేవారి సంఖ్య పెరుగుతోంది. ఏదో ఒక సంస్థ పేరు పెట్టుకుని దానిలో ఉద్యోగం కోసం పదివేలు కట్టాలని కొన్ని కన్సల్టెన్సీలు కోరుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు గురించి వెదికేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగం వల్ల తీరిక ఉండక కన్సల్టెన్సీ సర్వీసులను నమ్ముతున్నారు. మనదేశంలో అలా కాదు. నేరుగా ఉద్యోగం ఉందో లేదో? నేరుగా కనుక్కోవచ్చు. కానీ, విదేశీసంస్కృతిని దిగుమతి చేసుకున్నంత స్పీడుగానే ఈ కన్సల్టెన్సీ సర్వీసుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ కన్సల్టెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఒక్కోసారి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఎక్కువ డిపాజిట్టు చేయించుకుంటున్నారు. అలానే వ్యక్తిగత ప్రయోజనం కూడా పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా కన్సల్టెన్సీలు తమ ప్రతినిధులను నిరుద్యోగుల మీదకు పంపుతున్నారు. డబ్బు వ్యవహారంలో అదుపు ఉండదు కాబట్టి కొందరు ప్రతినిథులు సంస్థకు కూడా తెలియకుండా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోనూ, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో ఈ కన్సల్టెన్సీ సర్వీసులు, వారి ప్రతినిథులు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కాంతమ్మాన్ ప్రాజెక్టు పేరిట దాని నిర్వాహకుడు మాచర్ల శ్రీనివాస్ నిరుద్యోగులను మోసం చేశాడని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇటువంటి ప్రాజెక్టులను, కన్సల్టెన్సీలను నమ్మొద్దని కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/employment-vs-consultancy-24-15033.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





