విశాఖ వుడా పై సిబీఐ కొరడా
Publish Date:Jun 21, 2012
Advertisement
విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) అక్రమాలపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని సిబీఐ విశాఖ రేంజి డిఐజిని హైకోర్టు ఆదేశించింది. వుడా తమకు పంపించిన నోటీసులపై సవాల్ చేస్తూ బి.రామవరప్రసాద్, ఎ.సురేష్, మరో 11మంది హైకోర్టులో పిటీషను వేశారు. వుడా స్థల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన హైకోర్టు న్యాయమూర్తి దానిపై నివేదిక అవసరమని భావించి సిబీఐకి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే వివాదంలో విచారణకు ఇచ్చిన ఆదేశాలు పాటించలేదని గుర్తించిన న్యాయమూర్తి కేసును సుమోటోగా స్వీకరించారు. ప్రాథమిక విచారణ సిబీఐ విశాఖ రేంజి డిఐజి ఆరువారాల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలన్నారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను వుడా కొందరు బిల్డర్లకు అక్రమంగా కేటాయించింది. ఆ స్థలాల్లో భవన నిర్మాణాలకూ అక్రమంగా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో సిబీఐ నివేదిక హైకోర్టు కోరటం విశాఖలో పెద్ద సంచలనమైంది. ఆక్రమితదారులు ఆందోళన చెందుతున్నారు. సిబీఐ డిఐజి కార్యాలయంలో తమ సమీపబంధువులు ఎవరైనా పనిచేస్తుంటే వారి ద్వారా ప్రాథమిక విచారణ ఎప్పుడు ప్రారంభమావుతుందో తెలుసుకునేందుకు బిల్డర్లు సిద్ధపడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసు వల్ల సిబీఐ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసుకున్న బిల్డర్లు భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో వుడాపై కేసువేస్తే అది వెనక్కు తగ్గుతుందనుకుంటే సిబీఐ విచారణకు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించటం పిటీషన్ వేసిన 13 మందికి మింగుడుపడటం లేదు. వుడాను కోర్టు హెచ్చరిస్తుందనుకుంటే న్యాయమూర్తి తమను హెచ్చరించినట్లు అయిందని ఓ బిల్డరు బహిరంగంగా వాపోయారు.
http://www.teluguone.com/news/content/-vishaka-huda-cbi-24-15034.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





