బీజేపీకి జగన్ బీ-టీమ్... షర్మిల ఫైర్

Publish Date:Feb 14, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నిప్పులు చెరిగారు. కడప జిల్లాలో సాగుతున్న 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ పేరుకే ప్రతిపక్షమని, వాస్తవానికి అది బీజేపీ కూటమిలో అంతర్భాగమని సంచలన వ్యాఖ్యలు చేశారు. "బీజేపీతో టీడీపీ, జనసేనది సక్రమ సంబంధమైతే.. వైసీపీది అక్రమ సంబంధం" అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే జగన్‌కు తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే మతతత్వ బీజేపీకి వైసీపీ 'బీ-టీమ్'లా మారిందని విమర్శించారు.

*​రాష్ట్ర ప్రజలకు ద్రోహం..

​రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవుల ఓట్లతో గెలిచిన జగన్, ఢిల్లీకి వెళ్ళగానే మతతత్వ బీజేపీకి దాసోహం అవుతున్నారని షర్మిల మండిపడ్డారు. "వైఎస్సార్ కొడుకునని చెప్పుకునే జగన్, అదే వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటు" అని ధ్వజమెత్తారు. తనపై ఉన్న అవినీతి కేసులు, అక్రమ ఆస్తుల వ్యవహారం నుంచి తప్పించుకోవడానికే జగన్ మోదీ ముందు సాగిలపడ్డారని ఘాటుగా విమర్శించారు. అందుకే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నా జగన్ నోరు మెదపడం లేదని ఆరోపించారు.

*​గాంధీని చంపిన గాడ్సే వారసులే వీరు..

​నాడు గాడ్సే గాంధీని భౌతికంగా హతమార్చితే, నేడు మోదీ పథకానికి గాంధీ పేరు తొలగించి మళ్ళీ చంపారని, జగన్ దీనికి మౌనంగా సహకరిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రాష్ట్రంపై రూ. 5 వేల కోట్ల భారం పడే విబిజి రామ్ జి  చట్టానికి జగన్ మద్దతు తెలపడం పేదల పొట్ట కొట్టడమేనని అన్నారు. "మత రాజకీయాలతో దేశాన్ని విభజిస్తున్న బీజేపీకి మద్దతిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది" అని హెచ్చరించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా, విభజన హామీలు అమలు కాకపోయినా జగన్, చంద్రబాబులిద్దరూ మోదీ కాళ్ళ దగ్గర పడి ఉన్నారని ఆమె విమర్శించారు.

By
en-us Political News

  
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
తప్పుడు కేసుల వల్ల తాను ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న మానసిక వేదన, ఆర్థిక నష్టం, సామాజికంగా ఎదురైన అవమానాలకు గాను రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థను అడ్డం పెట్టుకుని తనను లక్ష్యంగా చేసుకున్న అధికారులు తమ సొంత జేబుల నుంచే ఈ పరిహారం చెల్లించాలన్నారు. ఇది భవిష్యత్తులో ఏ అధికారి కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తోటి అధికారులపై తప్పుడు కుట్రలు చేయకుండా గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఇండియా లక్ష్యంగా సాగుతున్న కేంద్రంగా సాగుతున్న పరోక్ష ( ప్రాక్సీ) యుద్ధవ్యూహాలు దక్షిణాసియా భద్రతకు ముప్పుగా పరిణమించాయి. కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా.. దక్షిణాసియా మొత్తంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఎల్ఈటీ, జేఈఎమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కు తూటా తగిలింది.. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ధ్రువీకరించారు.
శనివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో పరుగుల సునామీ కాదు అంతకు మించి అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంత వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు మ్యాచ్ లలోనూ కలిపి ఏకంగా 986 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించడం ఇదే మొదటి సారి.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను ఏ విధంగా విస్తరిస్తున్నాయో తేటతెల్లం చేస్తోంది. ముఖ్యంగా అత్యంత సురక్షితమని భావించే దేశాలలో కూడా పాక్ భూభాగం నుంచి తన కార్యకలాపాలను నిర్వహించే లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్ ఏ విధంగా చొరబడుతున్నాయన్నది ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాది రికార్డు సృష్టించాడు. అతనికి తోడుగా ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీ 51 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 218 పరుగుల భారీ స్కోరు చేసింది.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు.
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అద్భుత ఘట్టం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తి కిరీటంతో మరో కలికితు రాయి వచ్చి చేరింది.
మెట్రో సంస్థకు కొత్త చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.