శుక్రవారం నాడు జమ్ము కాశ్మీర్లో 12 గంటల వ్యవధిలోనే తీవ్రవాదులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది జవాన్లు, ఎనిమిది మంది తీవ్రవాదులు మరణించారు. ఈ సందర్భంగా భారత జవాన్లు అప్రమత్తమై తీవ్రవాదులను తిప్పికొట్టారు. కాశ్మీర్లోని యురి సెక్టార్లో శుక్రవారం ఉదయం ఒక సైనిక శిబిరం మీద తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు ఆర్మీ జవాన్లు, ఓ అధికారితో సహా మరో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జవాన్లు ఆరుగురు తీవ్రవాదులను మట్టుబెట్టారు. శ్రీనగర్లోని సౌరా ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో లష్కరే తోయిబాకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కారులో వచ్చిన ఉగ్రవాదులు కారును ఆపకుండా వెళ్తుండటంతో జవాన్లు కాల్పులు జరిపారు. దాంతో కారులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులూ మరణించారు. అలాగే పోపియాన్ ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటి వరకు రెండు దశల పోలింగ్ పూర్తయింది. త్వరలో ప్రధాని నరేంద్రమోడీ జమ్ము కాశ్మీర్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులు జరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eleven-indian-soldiers-dead-attack-camp-kashmir--39-40877.html
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.