హమ్మయ్య జగన్ గుడ్ లుక్స్ లోకి అంబటి.. సామాజిక సమీకరణాలూ కలిసొచ్చాయిగా?

Publish Date:Feb 6, 2026

Advertisement

ఇంత కాలానికి అంబటి రాంబాబు జగన్ గుడ్ లుక్స్ లోకి వచ్చేశారు. అవును ఇప్పుడు వైసీపీలో ఇదే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ కు ఎంతో ఇష్టమైన బూతుపురాణాన్నివినిపించిన అంబటికి ఇక ఇప్పుడు పార్టీలో పదోన్నతి, కీలక స్థానం ఖాయమన్న భావన పార్టీలో వినిపిస్తోంది. పైగా వైసీపీ ఎకో సిస్టమ్ లో జగన్ దృష్టిలో పడాలన్నా, ఆయన మెప్పు పొందాలన్న ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడాలి. లేదా వారి ఇళ్లపై దాడులకు పాల్పడాలీ, అదీ కాకపోతే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలను దగ్ధం చేయాలి.

వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు. ఇక అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా జగన్  అధికారంలో ఉన్నప్పటి నుంచీ ఆయన మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ జనసేనాని పవన్ పై దూషణలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే వారిరువురికీ జగన్ కేబినెట్ లో స్థానం దక్కింది.  ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  జగన్ వైసీపీ లో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చేసి హద్దులు మీరి బూతులు, దాడులు, దౌర్జన్యాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన వారందరికీ అందలాలు దక్కాయి. పదవుల తాయిలాలు అందాయి.

అధికారం కోల్పోయిన తరువాత  అప్పట్లో హద్దులు మీరి చెలరేగిన వారిలో చాలా మంది జాగ్రత్తపడో, భయపడే నోటికి తాళాలు వేసేసుకున్నారు. కానీ అప్పటి కంటే ఎక్కువగా చెలరేగిపోతున్న అంబటి రాంబాబు  ఇప్పుడు జగన్ మెప్పు పొదారనీ వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయనకు పార్టీలో కీలక స్థానం ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే తన బూతులతో అంబటి రాంబాబు జనం దృష్టిలో మరింత దిగజారిపోయారని పరిశీలకులు అంటున్నారు.

అయితే జగన్  మెప్పు ముందు ప్రజల దృష్టిలో దిగజారడం ఏమంత విషయం కాదని వైసీపీయులు అంటున్నారు. ఇప్పుడు పార్టీలో చర్చ అంతా అంబటికి పార్టీలో దక్కే కీలక స్థానం ఏమిటన్నదే అని అంటున్నారు. అన్నిటికీ మించి తెలుగుదేశం కూటమిలో చీలకలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన అంబటికి పార్టీలో కీలక పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశంగా మారుతున్నంద ఆశా ఉందని అంటున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.