నిర్మలమ్మ బడ్జెట్ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగిరానున్నాయి. లిథీయం బ్యాటరీలపై పన్ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశలు ఉన్నాయి. విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వాల కీలక భాగస్వామ్యం అవసరమని విత్త మంత్రి తన బడ్జెట్ లో పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈలపై వరాల వర్షం
కేంద్ర ఆర్థిక మంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎంఎస్ఎంఈలకు వరాల వర్షం కురిపించారు. వీటికి ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేశారు. అంటే ఇప్పటి వరకూ ఇస్తున్న ఐదు కోట్ల రుణాలను పది కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇక నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నగరాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచేందుకు కొత్తగా 117 విమానాశ్రయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవి వచ్చే పదేళ్లలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇక పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే అంతర్రాష్ట్ర విద్యుత్తు పంపిణీ కోసం కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. మధ్య తరగతి ప్రజల కోసం 40 వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. అలాగే మెడికల్ టూరిజం అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు ఇస్తామని చెప్పారు. ఇక బీహార్ రాష్ట్రానికి వరాల వర్షం కురిపించారు. బీహార్ లోని నికలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే బీహార్ రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/electric-vehicles-prices-come-down-25-192194.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.