ఏక్ నాథ్ షిండేకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక.!
Publish Date:Jul 4, 2026
Advertisement
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఏక్ నాథ్ షిండే ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో షిండే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది. ఏక్నాథ్ షిండే ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. Maharashtra Deputy CM, Jupiter Hospital Thane, Eknath Shinde Health, Teluguone
http://www.teluguone.com/news/content/eknath-shinde-hospitalised-36-225035.html





