Publish Date:Oct 24, 2024
ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన చదువు అందించాలన్న సదాశయంతో ఎప్పుడో 2020లోకే కేంద్రం జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది. ఐదేళ్లు గడుస్తున్నా ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాల వేగం నత్తతో పోటీ పడుతోంది. ఇప్పటికీ దేశంలో విద్యార్థులకు అందుతున్నది వానాకాలం చదువులే. 21వ శాతాబ్దపు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెరగలేదు. విద్యా ప్రమాణాలను పెంచాలి, పరిశోధనలకు పెద్ద పీట వేయాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేయడంలో ప్రభుత్వాల వైఫల్యం విద్యార్థులకు శాపంగా మారింది.
ఇందుకు ప్రధాన కారణం రాజకీయమే. బడ్జెట్ లో సింహభాగం తదుపరి ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తూ ఉచితాలకు కేటాయించడమే. అదే సమయంలో విద్యకు కేటాయింపులు తగ్గిపోవడమే. విధానాల రూపకల్పనే కానీ నాణ్యతతో కూడిన విద్యను ప్రణాళికా బద్ధంగా విద్యార్థులకు అందించాలన్న రాజకీయ సంకల్పం ప్రభుత్వాలలో కొరవడింది. ఎన్నికలు, ఓట్లు, విజయం లక్ష్యంగానే ప్రభుత్వాల ప్రణాళికలు, కేటాయింపులు ఉంటున్నాయి.
2021-22 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలల్లో 26.52 కోట్లమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా వరకూపాఠశాలల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చాలా వరకూ పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. ఆట మైదానాలు లేవు. ఇక పాఠశాల భవనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు పాతిక శాతం పాఠశాలల పరిస్థితి ఇప్పుడో, ఇహనో కూలిపోతాయా అన్నంతగా శిథిలావస్థకు చేరుకున్నాయి. సరిపడా తరగతి గదులు లేవు. విద్యార్థుల సంఖ్యకు ఉండాల్సిన టీచర్ల సంఖ్యకూ అసలు పొంతనే లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ప్రతి సౌకర్యం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో తప్పని సరిగా ఉండాలి. అయితే దేశంలో ఆ చట్టం అమలు అవుతున్న దాఖలాలు లేవు. యువభారతం అంటూ భుజాలు తడుముకోవడమే తప్ప.. యువకులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా విద్యను అందించే విషయంలో మాత్రం మన ప్రభుత్వాలు పూర్తిగా వెనుకబడ్డాయని చెప్పక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/education-quality-very-ow-39-187335.html
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.