Publish Date:Oct 24, 2024
ఆర్థిక అంతరాలతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన చదువు అందించాలన్న సదాశయంతో ఎప్పుడో 2020లోకే కేంద్రం జాతీయ విద్యావిధానాన్ని రూపొందించింది. ఐదేళ్లు గడుస్తున్నా ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాల వేగం నత్తతో పోటీ పడుతోంది. ఇప్పటికీ దేశంలో విద్యార్థులకు అందుతున్నది వానాకాలం చదువులే. 21వ శాతాబ్దపు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు పెరగలేదు. విద్యా ప్రమాణాలను పెంచాలి, పరిశోధనలకు పెద్ద పీట వేయాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేయడంలో ప్రభుత్వాల వైఫల్యం విద్యార్థులకు శాపంగా మారింది.
ఇందుకు ప్రధాన కారణం రాజకీయమే. బడ్జెట్ లో సింహభాగం తదుపరి ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తూ ఉచితాలకు కేటాయించడమే. అదే సమయంలో విద్యకు కేటాయింపులు తగ్గిపోవడమే. విధానాల రూపకల్పనే కానీ నాణ్యతతో కూడిన విద్యను ప్రణాళికా బద్ధంగా విద్యార్థులకు అందించాలన్న రాజకీయ సంకల్పం ప్రభుత్వాలలో కొరవడింది. ఎన్నికలు, ఓట్లు, విజయం లక్ష్యంగానే ప్రభుత్వాల ప్రణాళికలు, కేటాయింపులు ఉంటున్నాయి.
2021-22 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలల్లో 26.52 కోట్లమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా వరకూపాఠశాలల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. చాలా వరకూ పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవు. ఆట మైదానాలు లేవు. ఇక పాఠశాల భవనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు పాతిక శాతం పాఠశాలల పరిస్థితి ఇప్పుడో, ఇహనో కూలిపోతాయా అన్నంతగా శిథిలావస్థకు చేరుకున్నాయి. సరిపడా తరగతి గదులు లేవు. విద్యార్థుల సంఖ్యకు ఉండాల్సిన టీచర్ల సంఖ్యకూ అసలు పొంతనే లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ప్రతి సౌకర్యం విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో తప్పని సరిగా ఉండాలి. అయితే దేశంలో ఆ చట్టం అమలు అవుతున్న దాఖలాలు లేవు. యువభారతం అంటూ భుజాలు తడుముకోవడమే తప్ప.. యువకులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా విద్యను అందించే విషయంలో మాత్రం మన ప్రభుత్వాలు పూర్తిగా వెనుకబడ్డాయని చెప్పక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/education-quality-very-ow-39-187335.html
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.