తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. అయితే గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ సారి స్వయంగా విద్యాశాఖమంత్రి పరీక్షల ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే నెల నాలుగు నుంచి ఇరవై మూడు వరకు (మార్చి 4-23) ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 1339 సెంటర్ లలో 24,740 మంది ఇన్విజిలేటర్ లను నియమించింది.
గతేడాది ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పై చెలరేగిన వివాదంతో రాష్ట్రం అట్టుడికింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను కుదిపేశాయి. దీంతో ఈ సారి ఇంటర్ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పేపర్ వ్యాల్యూషన్ పై గతేడాది జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కలెక్టర్ అధ్యక్షతన హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ఆదేశించారు. రెవిన్యూ పోలీస్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్తు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లను కోరారు. పరీక్షల సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఆందోళన చెందొద్దని కోరారు. విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్షల ప్రారంభానికి ముందు చేయాల్సిన మిగతా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/education-minister-sabitha-indra-reddy-reviews-arrangements-for-inter-exams-25-93980.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.