Publish Date:May 17, 2023
జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2019లో ఆ పార్టీకి అధికారికంగా కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఉపసంహరించుకుంది. ఈ సారి గాజు గ్లాస్ చిహ్నాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడం ద్వారా జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ నుంచి రెండు పార్టీలు మాత్రమే రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీలుగా ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అవి అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు. దీంతో ఆ రెండు పార్టీల ఎన్నికల చిహ్నాలైన ఫ్యాన్, సైకిల్ గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది.
అదే సమయంలో అధికారిక గుర్తింపు పొందని జనసేనకు గత ఎన్నికల సమయంలో కేటాయించిన గ్లాసు చిహ్నాన్ని ఈ సారి ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. 2019 ఎన్నికలలో గుర్తింపు కోసం అవసరమైనన్ని ఓట్లు జనసేనకు రాకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ జనసేనకు తమ పార్టీకే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీని కోరే అవకాశం మాత్రం ఉంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసినందున ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని జనసేన కోరుకునేందుకు వెసులుబాటు ఉంది. అందుకు ఈసీ ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే.. ఇక్కడో చిక్కు ఉంది. అలా కోరాలంటే జనసేన రాష్ట్రంలోని 175 స్థానాలలోనూ పోటీలో ఉండాల్సి ఉంటుంది. అయితే జనసేన, తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలోనే పోటీ చేసే అవకాశాలు ఉండటంతో.. జనసేన పోటీలో లేని నియోజకవర్గాలలో గాజు గ్లాసు సింబల్ ను స్వతంత్రులెవరైనా కోరితే.. అక్కడ వారి విజ్ణప్తిని ఈసీ తిరస్కరించే అవకాశం ఉండదు.
అంటే జనసేన పోటీ చేసే స్థానాలలో ఈ పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించినా, ఆ పార్టీ పోటీలేని నియోజకవర్గాలలో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓటర్లలో ఒకింత అయోమయం ఏర్పడేందుకు వీలుంటుంది. అంటే తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన సందర్భం ఉంటే ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అంతిమంగా తెలుగుదేశం, జనసేనకు నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ec-keeps-glass-symbol-in-free-list-25-155454.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.